News March 27, 2025

ఫోన్ చూడొద్దన్నందుకు కర్నూలులో యువకుడి ఆత్మహత్య

image

తల్లిదండ్రుల మందలించారని యువకుడు ఆత్మహత్యకు చేసుకున్న ఘటన కర్నూలులో జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. చౌడేశ్వరి వీధిలో నివాసం ఉంటున్న కృష్ణమోహన్, వసంత దంపతుల కుమారుడు యశ్వంత్ (21) వడ్రంగి పని చేస్తున్నారు. కొన్ని రోజులుగా పనికి వెళ్లకుండా ఫోన్ చూస్తుండంతో వారు మందలించారు. మనస్తాపం చెందిన యువకుడు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News December 1, 2025

నల్గొండ: సర్పంచ్ ఎన్నికలు.. పార్టీలకు మరో తలనొప్పి..!

image

ఉమ్మడి నల్గొండ జిల్లాలో చాలా చోట్ల రెండు, మూడు మధిర గ్రామాలు ఓ మేజర్ గ్రామ పంచాయతీ కింద కొనసాగుతున్నాయి. అయితే ప్రస్తుతం మేజర్ గ్రామాల నేతలకు, మధిర గ్రామాల నేతలకు మధ్య తీవ్ర పోటీ నెలకొంది. తమ గ్రామంలో ఓట్లు ఎక్కువ ఉన్న కులం వారికే సర్పంచ్ రిజర్వేషన్ వచ్చిందని, అందుకే తమ గ్రామంలోని అభ్యర్థులకే ప్రధాన పార్టీలు మద్దతు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో ప్రధాన పార్టీలకు కొత్త తలనొప్పి వచ్చి పడింది.

News December 1, 2025

రేపు హైకోర్టుకు పరకామణి కేసు నివేదిక

image

AP: టీటీడీ పరకామణి కేసు విచారణ నేటితో పూర్తి కానుంది. రేపు సీఐడీ అధికారులు హైకోర్టుకు నివేదిక సమర్పించనున్నారు. హైకోర్టు ఆదేశాలతో అక్టోబర్ 27 నుంచి సీఐడీ.. టీటీడీ మాజీ ఛైర్మన్లు వైవీ సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, మాజీ ఈవో ధర్మారెడ్డి సహా 35 మందిని విచారించింది. విచారణకు హాజరవుతూ అప్పటి AVSO సతీశ్ అనుమానాస్పదంగా మరణించారు. చెన్నై, బెంగళూరు, విశాఖలో నిందితుడు రవికుమార్ ఆస్తులను పరిశీలించింది.

News December 1, 2025

HYD: ఇష్టారీతిగా ప్రైవేట్ స్కూల్ ఫీజులు వసూళ్లు!

image

నగరంలో ప్రైవేట్ స్కూల్స్ దోపిడీకి అడ్డు అదుపు లేకుండా పోతుంది. తమ జేబులు ఖాళీ చేయడంమే లక్ష్యంగా ప్రైవేట్ స్కూల్స్ ఉంటున్నాయని పేరెంట్స్ వాపోతున్నారు. ట్యూషన్, స్పెషల్ ఫీజులతో ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ప్రభుత్వం ఫీజులు నియంత్రణ చేపటకపోవడంతో, ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు రెచ్చిపోతున్నారు. దీనిపై సహించేది లేక విద్యాశాఖకు ఫిర్యాదు చేయాలని తల్లిదండ్రులు యోచిస్తున్నారు.