News March 22, 2025
ఫోన్ చేసి సమస్యలు తెలపండి: నిర్మల్ కలెక్టర్

అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో మారుమూల ప్రాంతాల ప్రజల సహాయార్థం ప్రతి సోమవారం టెలిఫోన్ ప్రజావాణి నిర్వహించనున్నట్లు కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. ప్రతి సోమవారం ఉదయం 10:30 నుంచి 11 గంటల వరకు ప్రజలు తమ ఇంటి నుంచే 91005 77132 నంబర్కు కాల్ చేసి నేరుగా తమ సమస్యలను తెలుపవచ్చన్నారు. అలాగే ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కలెక్టరేట్లో యథావిధిగా ప్రజావాణి కొనసాగుతుందన్నారు.
Similar News
News November 14, 2025
రహదారిపై షెడ్లు, నిర్మాణాలు చేయవచ్చా?

ఇంటి ముందు దారిపై వాహనం నిలపడం, కారు పార్క్కు షెడ్లు వేయడం సరికాదని వాస్తు శాస్త్రం చెబుతోంది. తమ సొంత స్థలంలో ఇలాంటి నిర్మాణాలు చేసుకోవాలి కానీ, అందరికీ చెందాల్సిన రహదారిలో ఆటంకం కలిగించేలా నిర్మాణాలు చేయడం ఆ ఇంటికి, ఇంట్లో సభ్యులకు మంచిది కాదని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. ‘ఈ ధోరణితో గొడవలు, ప్రమాదాలకు ఆస్కారం ఉంది. వాస్తు శాంతికి సామాజిక శాంతి కూడా ముఖ్యమే’ అని అంటారు. <<-se>>#Vasthu<<>>
News November 14, 2025
అవకాశాలను అందిపుచ్చుకోవడంలో CBN టాప్: పీయూష్

AP: భవిష్యత్ను ముందే ఊహించి CBN అవకాశాలను అందిపుచ్చుకుంటారని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ CII సదస్సులో కొనియాడారు. ఒకప్పుడు IT, ఇప్పుడు డ్రోన్లు, స్పేస్, ఏఐ, క్వాంటమ్లలో ముందున్నారని చెప్పారు. ఫస్ట్ మూవర్స్ అడ్వాంటేజ్ని తామెప్పుడూ అందిపుచ్చుకుంటూనే ఉంటామని CM తెలిపారు. APలో డ్రోన్ ట్యాక్సీలు తీసుకువచ్చేలా అభివృద్ధి చేస్తామన్నారు. డ్రోన్, స్పేస్ సిటీలకు CM, మంత్రి వర్చువల్గా శంకుస్థాపన చేశారు.
News November 14, 2025
పాఠశాలల్లో డ్రాపౌట్లు ఉండకూడదు: కలెక్టర్ సిరి

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు డ్రాపౌట్లు కాకుండా చూడాలని, పిల్లలను వలసలకు తీసుకెళ్లే తల్లిదండ్రులతో మాట్లాడి ఒప్పించాలని కర్నూలు జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి విద్యా శాఖాధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో డీఈఓ, ఎంఈఓలతో నిర్వహించిన సమీక్షలో ఆమె ఈ ఆదేశాలు ఇచ్చారు. పశ్చిమ ప్రాంతంలో ఈ సమస్యపై దృష్టి సారించాలని సూచించారు.


