News April 4, 2024
ఫోన్ ట్యాపింగ్ పై డిప్యూటీ సీఎం భట్టి కీలక వ్యాఖ్యలు

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం విపక్ష నేతల ఫోన్ ట్యాపింగ్ చేసి పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛను హరించిందని మండిపడ్డారు. మంత్రులు, జడ్జిల ఫోన్లు సైతం ట్యాపింగ్కు గురయ్యాయంటే బీఆర్ఎస్ పాలనలో పరిస్థితి ఎలా ఉండేదో అర్ధం చేసుకోవచ్చు అని అన్నారు.
Similar News
News April 17, 2025
ఖమ్మం: ఇద్దరు పిల్లలను నరికి తల్లి SUICIDE

హైదరాబాద్ జీడిమెట్ల PS పరిధిలో దారుణం జరిగింది. ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన వివాహిత తేజ(30) గాజులరామారంలో ఉంటుంది. వేట కొడవలితో ఇద్దరు కొడుకులను నరికి, ఆనక తల్లి భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ తగాదాల నేపథ్యంలో 7, 5 ఏళ్ల పిల్లలను కిరాతకంగా నరికి చంపిందని స్థానికులు అనుమానిస్తున్నారు. మరిన్ని వివరాలు పోలీసులు నిర్ధారించాల్సి ఉంది.
News April 17, 2025
సమ్మర్ టూర్.. ఉమ్మడి ఖమ్మం జిల్లాను చుట్టేద్దాం..

సమ్మర్ HOLIDAYS వచ్చాయంటే ఫ్యామిలీతో కలిసి ఎక్కడికి వెళ్లాలా అని ఆలోచిస్తుంటారు. మన ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనూ చాలా పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాంతాలు ఉన్నాయి. ఖమ్మం ఫోర్ట్, పాపికొండలు, పులిగుండాల, లకారం ట్యాంక్బండ్, నేలకొండపల్లి బౌద్ధ క్షేత్రం, భద్రాచలం రామయ్య గుడి, పర్ణశాల, కిన్నెరసాని ప్రాజెక్ట్, పాల్వంచ పెద్దమ్మ గుడిని ఒక్క రోజులో చుట్టేయొచ్చు. వీటిలో మీరు ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నారో కామెంట్ చేయండి
News April 17, 2025
గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో టేకులపల్లి వాసి

టేకులపల్లి మండలం సంపత్నగర్కు చెందిన కుడితేటి రమేశ్కు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు దక్కింది. క్రిస్టియన్ గీతాలపై ప్రపంచ స్థాయిలో జరిగిన ఆన్లైన్ మ్యూజిక్ ప్రదర్శనలో రమేశ్ పాల్గొనగా కీబోర్డు వాయిద్య బృందం గంటలో 1,046 వీడియోలు అప్లోడ్ చేసింది. ఈ బృందంలో రమేశ్ సభ్యుడు. సోమవారం హోలెల్ మ్యూజిక్ స్కూల్ నిర్వాహకుల చేతుల మీదుగా మెడల్ అందుకున్నాడు.