News December 7, 2024
ఫ్రాన్స్ యువతిని పెళ్లాడిన గొల్లపల్లి యువకుడు
శ్రీ సత్యసాయి జిల్లా యువకుడు ఫ్రాన్స్ యువతిని పెళ్లాడారు. గోరంట్ల మం. గొల్లపల్లికి చెందిన సందీప్ యాదవ్ ఫ్రాన్స్లోని సీఎన్ఆర్ యూనివర్సిటీలో సైంటిస్ట్గా పనిచేస్తున్నారు. అదే నగరంలో గూగుల్లో పనిచేస్తున్న అడ్సవిన్ అనే యువతితో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారడంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కుటుంబ సభ్యులు ఒప్పుకోవడంతో హిందూపురం పరిధిలోని ఓ ఫంక్షన్ హాల్లో పెళ్లి చేసుకున్నారు.
Similar News
News January 14, 2025
రోడ్డు ప్రమాదాలను నియంత్రించవచ్చు: ఎస్పీ
రోడ్డు భద్రతా నియమాలు పాటించడం, స్వీయ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల దాదాపుగా రోడ్డు ప్రమాదాలను నియంత్రించవచ్చని అనంతపురం ఎస్పీ జగదీశ్ పేర్కొన్నారు. హెల్మెట్/ సీటుబెల్టు ధరించడంతో పాటు త్రిబుల్ రైడింగ్, ఓవర్లోడింగ్, డ్రంకన్ డ్రైవ్, తదితర ఉల్లంఘనలకు దూరంగా ఉండాలన్నారు. మోటారు వాహనాల చట్ట ప్రకారంగా గడిచిన వారం రోజుల్లో 2,881 కేసులు నమోదు చేశామన్నారు.
News January 13, 2025
BREAKING: తాడిపత్రి ఏఎస్పీగా రోహిత్ కుమార్ చౌదరి
తాడిపత్రి ఏఎస్పీగా రోహిత్ కుమార్ చౌదరి నియమితులయ్యారు. ఏపీ ప్రభుత్వం ఐదుగురు ఐపీఎస్ అధికారులకు పోస్టింగ్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా తాడిపత్రి ఏఎస్పీగా రోహిత్ కుమార్ చౌదరి నియమితులయ్యారు. రోహిత్ 2022 బ్యాచ్కు చెందిన ఐపీఎస్ అధికారి.
News January 13, 2025
అనంతపురానికి CM అన్యాయం చేస్తున్నారు: తోపుదుర్తి
కుప్పం ప్రజలకు నీరు ఇవ్వడానికి CM చంద్రబాబు అనంతపురం జిల్లా ప్రజల కడపుకొడుతున్నారని రాప్తాడు మాజీ MLA తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి మండిపడ్డారు. ‘కుప్పానికి నీళ్లు తరలించడానికి అనంతపురం జిల్లా పరిధిలో హంద్రీనీవా కాలువలో లైనింగ్ పనులు చేస్తున్నారు. దీంతో జిల్లాలో భూగర్భ జలాలు అడుగంటిపోతాయి. 5లక్షల ఎకరాలకు నీరు అందదు. CMకు రాజకీయం తప్ప అనంతపురం ప్రజల ప్రయోజనాలు పట్టడం లేదు’ అని తోపుదుర్తి అన్నారు.