News April 11, 2025
ఫ్రీ కోచింగ్ సద్వినియోగం చేసుకోండి: సింగరేణి డైరెక్టర్

నెల రోజుల పాటు నిర్వహించనున్న టీఎస్ పాలిసెట్ ఉచిత కోచింగ్ను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సింగరేణి డైరెక్టర్ వెంకటేశ్వర్లు అన్నారు. కొత్తగూడెం సింగరేణి ఉన్నత పాఠశాలలో టీఎస్-పాలిసెట్ ఎంట్రన్స్ టెస్ట్ కోసం ఉచిత కోచింగ్ కార్యక్రమాన్ని సింగరేణి ఎడ్యుకేషనల్ సొసైటీ సెక్రటరీ జీ.శ్రీనివాస్తో కలిసి ఆయన ప్రారంభించారు.
Similar News
News October 17, 2025
APPLY NOW: పవర్గ్రిడ్లో ఉద్యోగాలు..

పవర్గ్రిడ్లో 20 ఆఫీసర్ ట్రైనీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. CA/ICWA ఉత్తీర్ణులైన అభ్యర్థులు నవంబర్ 5వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు రూ.500, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. అభ్యర్థుల గరిష్ఠ వయసు 28 ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్లో సడలింపు ఉంది. రాతపరీక్ష(CBT),ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://www.powergrid.in/
News October 17, 2025
టైర్ పేలి దగ్ధమైన బస్సు.. 29 మంది క్షేమం

అనంతపురం (D) గార్లదిన్నె మం. తలగాచిపల్లి క్రాస్ వద్ద 44వ జాతీయ రహదారిపై అర్ధరాత్రి పెను ప్రమాదం తప్పింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బెంగళూరు నుంచి రాయచూర్లోని దేవదుర్గకు వెళ్తుండగా మార్గమధ్యలో బస్సు టైర్ పగిలింది. మంటలు ఎగిసి పడటంతో బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఆ సమయంలో బస్సులో ఉన్న 29 మంది ప్రయాణికులు అప్రమత్తమై సురక్షితంగా బయటపడ్డారు. ఎస్సై మహమ్మద్ గౌస్ ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.
News October 17, 2025
సింగరేణి కార్మికులకు నేడు రూ.1.03 లక్ష బోనస్

కొత్తగూడెం: సింగరేణి సంస్థల్లో పనిచేస్తున్న కార్మికులకు శుక్రవారం దీపావళి సందర్భంగా పర్ఫామెన్స్ లింక్డ్ రివార్డు బోనస్ అందనుంది. యాజమాన్యం ఈసారి ఒక్కొక్క కార్మికుడికి రూ.1.03 లక్ష చెల్లించాలని నిర్ణయించింది. గత సంవత్సరం రూ.93,750 చెల్లించగా, ఈసారి రూ.9,250 పెంచి ఇస్తోంది. ఈ నగదు నేడు(శుక్రవారం) కార్మికుల బ్యాంకు ఖాతాల్లో జమ కానుంది. ప్రతి సంవత్సరం దీపావళికి ముందు సంస్థ ఈ బోనస్ను అందిస్తుంది.


