News March 7, 2025

ఫ్రీ జర్నీ జిల్లాకే పరిమితం.. మీ కామెంట్

image

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించేందుకు ప్రభుత్వం ముమ్మర కసరత్తు చేస్తోంది. అయితే ‘ఏ జిల్లా మహిళలకు.. ఆ జిల్లాలో మాత్రమే ఆర్టీసీలో ఉచిత ప్రయాణానికి అనుమతించాలని నిర్ణయించాం’ అని మంత్రి సంధ్యారాణి మండలిలో ప్రకటన చేశారు. ఈ లెక్కన కర్నూలు, నంద్యాలలోని మహిళల ఉచిత ప్రయాణాలు ఆ జిల్లాల వరకే పరిమితం అవుతాయి. పక్క జిల్లాలో ప్రయాణించాలంటే బార్డర్ నుంచి టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. దీనిపై మీ కామెంట్..

Similar News

News October 26, 2025

25 ప్రైవేట్ బస్సులకు భారీగా జరిమానా: RTO

image

కర్నూలు(D) జిల్లా బస్సు దుర్ఘటన నేపథ్యంలో శనివారం రాత్రి తిరుపతి జిల్లా వ్యాప్తంగా RTA అధికారులు తనిఖీలు చేపట్టారు. RTO మురళీమోహన్ నిబంధనలు పాటించని 25 బస్సులపై కేసులు నమోదు చేశారు. అగ్ని మాపక నియంత్రణ పరికరాలు లేనివి 5, సరుకు రవాణా చేస్తున్న వాహనాలు 6, అనధికార సీటింగ్ మార్పిడిపై కేసులు నమోదయ్యాయన్నారు. మొత్తం రూ.3లక్షలు జరిమానా విధించినట్లు పేర్కొన్నారు.

News October 26, 2025

సిద్దిపేట: ఆమె ఓపికకు సలాం..!

image

మంత్రి అడ్లూరి లక్ష్మణ్ శనివారం సిద్దిపేటలో పర్యటించిన సందర్భంగా వెంకటేశ్వర ఆలయం వద్ద పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఈ డ్యూటీలో గర్భిణీ అయిన ఓ మహిళా కానిస్టేబుల్ రెండు, మూడు గంటల పాటు నిలబడాల్సి వచ్చింది. ఆమె ఓపికను కొందరు అభినందించగా, ఇబ్బందికర పరిస్థితుల్లో అలాంటి డ్యూటీ వేయడంపై మరికొందరు విమర్శించారు.

News October 26, 2025

ప్రైవేట్ ట్రావెల్స్ వద్దు బాబోయ్!

image

కర్నూలులో వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదంతో ప్రయాణికులు ప్రైవేట్ బస్సులంటేనే వణికిపోతున్నారు. ఆలస్యమైనా ఫర్వాలేదు ఆర్టీసీ బస్సుల్లోనే వెళ్లడం బెటర్ అని అభిప్రాయపడుతున్నారు. హైదరాబాద్-విజయవాడ మధ్య సుమారు 250 కి.మీ దూరం ఉంటే ప్రైవేట్ బస్సులు 3 గంటల్లోనే వెళ్తాయి. దీన్ని బట్టి అవి ఎంత వేగంగా దూసుకెళ్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఆ స్పీడ్‌లో ఏదైనా ప్రమాదం జరిగితే భారీ నష్టం జరిగే అవకాశం ఉంటుంది.