News March 7, 2025
ఫ్రీ జర్నీ జిల్లాకే పరిమితం.. మీ కామెంట్

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించేందుకు ప్రభుత్వం ముమ్మర కసరత్తు చేస్తోంది. అయితే ‘ఏ జిల్లా మహిళలకు.. ఆ జిల్లాలో మాత్రమే ఆర్టీసీలో ఉచిత ప్రయాణానికి అనుమతించాలని నిర్ణయించాం’ అని మంత్రి సంధ్యారాణి మండలిలో ప్రకటన చేశారు. ఈ లెక్కన కర్నూలు, నంద్యాలలోని మహిళల ఉచిత ప్రయాణాలు ఆ జిల్లాల వరకే పరిమితం అవుతాయి. పక్క జిల్లాలో ప్రయాణించాలంటే బార్డర్ నుంచి టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. దీనిపై మీ కామెంట్..
Similar News
News November 9, 2025
కామారెడ్డిలో మటన్, చికెన్ ధరల వివరాలు ఇలా..!

కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు వివిధ మండలాల్లో ఆదివారం మటన్, చికెన్ ధరల వివరాలు ఇలా ఉన్నాయి. మటన్ కిలో రూ.800 కాగా, చికెన్ స్కిన్ లెస్ కిలో రూ.250, లైవ్ కోడి కిలో రూ.160 చొప్పున విక్రయిస్తున్నారు. కార్తీక మాసం కావడంతో మాంసం విక్రయాలు తగ్గుముఖం పట్టాయని విక్రయదారులు చెప్పారు.
News November 9, 2025
కొలికపూడిపై చర్యలు తీసుకోవాలి.. CBNకు పార్టీ క్రమశిక్షణ కమిటీ నివేదిక

AP: ఎంపీ చిన్నితో వివాదంలో తప్పంతా MLA కొలికపూడిదేనంటూ TDP క్రమశిక్షణ కమిటీ సీఎం చంద్రబాబుకు నివేదిక ఇచ్చింది. ఎన్నికైనప్పటి నుంచి పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారని పేర్కొంది. తన ఆరోపణలపై కొలికపూడి ఒక్క ఆధారం సమర్పించలేదని, సస్పెన్షన్ లేదా అధికారాలు తీసేయాలని సీఎంకు విన్నవించినట్లు సమాచారం. అయితే వారిద్దరినీ పిలిచి మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని కమిటీకి CBN చెప్పారు.
News November 9, 2025
కామారెడ్డి: నేటి నుంచి కాలభైరవ స్వామి ఉత్సవాలు

రామారెడ్డి మండలం ఇసన్నపల్లిలోని కాలభైరవ స్వామి జన్మదిన వేడుకలు నేటి నుంచి ఈ నెల 13వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో ప్రభు తెలిపారు. తొలి రోజు బద్ది పోచమ్మకు బోనాలు, సోమవారం లక్ష దీపార్చన, మంగళవారం డోలారోహణం, జన్మదినోత్సవం, బుధవారం రథోత్సవం, రక్షా యజ్ఞం, అగ్నిగుండాలు ఇతర పూజా కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు. భక్తులకు అన్ని వసతులు కల్పించినట్లు ఈవో పేర్కొన్నారు.


