News March 7, 2025

ఫ్రీ జర్నీ జిల్లాకే పరిమితం.. మీ కామెంట్

image

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించేందుకు ప్రభుత్వం ముమ్మర కసరత్తు చేస్తోంది. అయితే ‘ఏ జిల్లా మహిళలకు.. ఆ జిల్లాలో మాత్రమే ఆర్టీసీలో ఉచిత ప్రయాణానికి అనుమతించాలని నిర్ణయించాం’ అని మంత్రి సంధ్యారాణి మండలిలో ప్రకటన చేశారు. ఈ లెక్కన కర్నూలు, నంద్యాలలోని మహిళల ఉచిత ప్రయాణాలు ఆ జిల్లాల వరకే పరిమితం అవుతాయి. పక్క జిల్లాలో ప్రయాణించాలంటే బార్డర్ నుంచి టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. దీనిపై మీ కామెంట్..

Similar News

News February 8, 2026

VZM: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

డెంకాడ మండలం ముంగినాపల్లి గ్రామ సమీపంలోని మలుపువద్ద ఉన్న స్తంభాన్ని బైక్‌ ఢీ కొట్టడంతో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన శనివారం అర్ధరాత్రి జరిగింది. ఈ ప్రమాదంలో పూసపాటిరేగ మండలం రెల్లివలస గ్రామానికి చెందిన ముసినేని మురళి (41) మృతి చెందాడని పోలీసులు గుర్తించారు. ఆదివారం మృతిడి భార్య సరోజిని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సన్యాసినాయుడు తెలిపారు.

News February 8, 2026

వచ్చే సంక్రాంతికి ‘సోగ్గాడే చిన్నినాయనా’ పార్ట్-3

image

కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నాగార్జున నటించిన ‘సోగ్గాడే చిన్నినాయనా’ 2016 సంక్రాంతికి విడుదలై హిట్టయిన సంగతి తెలిసిందే. దీనికి సీక్వెల్‌ ‘బంగార్రాజు’లో నాగార్జున, నాగచైతన్య నటించారు. ఆ మూవీ 2022 సంక్రాంతికి రిలీజై ఆకట్టుకుంది. ఇప్పుడు దానికి కొనసాగింపుగా మూడో పార్ట్ రానుంది. ‘వాసివాడి తస్సాదియ్యా.. 2027 JAN 15న సోగ్గాళ్లు వస్తే పండగ కలర్‌ఫుల్‌గా ఉంటుంది కదా’ అని అన్నపూర్ణ స్టూడియోస్ ట్వీట్ చేసింది.

News February 8, 2026

పిట్లం: కూలి డబ్బుల కోసం హత్య

image

పిట్లంలో ఈ నెల <<19069742>>6న జరిగిన హత్య<<>> కేసును పోలీసులు ఛేదించారు. బాన్సువాడ DSP విఠల్ రెడ్డి వివరాలు వెల్లడించారు. UPకి చెందిన రాజేశ్, శ్రీకృష్ణ పెయింటింగ్ పనుల కోసం పిట్లం వచ్చారు. కూలీ డబ్బుల విషయంలో వారిద్దరి మధ్య వివాదం తలెత్తింది. ఈ క్రమంలో రాజేశ్‌ను శ్రీకృష్ణ కర్రతో కొట్టి హత్య చేసి పరారయ్యాడు. నిందితుడు ఊరు విడిచి వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.