News January 31, 2025

ఫ్లోర్ లీడర్‌గా పిల్లి సుభాష్ చంద్రబోస్

image

అంబేడ్కర్ కోనసీమ జిల్లా నేతకు మాజీ సీఎం జగన్ మరోసారి కీలక పదవి ఇచ్చారు. ఇప్పటి వరకు రాజ్యసభలో వైసీపీ ఫ్లోర్ లీడర్‌గా విజయసాయి రెడ్డి ఉన్నారు. ఎంపీ పదవికి ఆయన రాజీనామా చేయడంతో ఆ పదవి ఖాళీగా ఉంది. దీంతో రామచంద్రాపురానికి చెందిన పిల్లి సుభాష్ చంద్రబాస్‌ను వైసీపీ ఫ్లోర్ లీడర్‌గా జగన్ ఎంపిక చేశారు. రాజ్యసభలో జరిగే అన్ని సమావేశాలకు వైసీపీ తరఫున సుభాష్ చంద్రబోస్ హాజరవుతారు.

Similar News

News October 25, 2025

HYD: డీఐ ఛేజింగ్.. ఎట్టకేలకు అతడు చిక్కాడు..!

image

HYD దుండిగల్ PS పరిధిలో ఖయ్యూం అనే వ్యక్తి ఒకరిని మోసం చేసి రూ.25 లక్షలను కాజేశాడు. కేసు దర్యాప్తులో భాగంగా శుక్రవారం రాత్రి మేడ్చల్ రైల్వే స్టేషన్‌లో ఖయ్యూం ఉన్నట్లు వచ్చిన సమాచారంతో డీఐ కిరణ్ సిబ్బందితో కలిసి వెళ్లాడు. పోలీసులను చూడగానే ఖయ్యూం రైలు పట్టాల మీదుగా పరిగెత్త సాగాడు. డీఐ కిరణ్, సిబ్బంది కలిసి అతడి వెంట పరిగెత్తి సినిమా స్టైల్‌లో ఛేజింగ్ చేసి పట్టుకున్నారు.

News October 25, 2025

HYD: డీఐ ఛేజింగ్.. ఎట్టకేలకు అతడు చిక్కాడు..!

image

HYD దుండిగల్ PS పరిధిలో ఖయ్యూం అనే వ్యక్తి ఒకరిని మోసం చేసి రూ.25 లక్షలను కాజేశాడు. కేసు దర్యాప్తులో భాగంగా శుక్రవారం రాత్రి మేడ్చల్ రైల్వే స్టేషన్‌లో ఖయ్యూం ఉన్నట్లు వచ్చిన సమాచారంతో డీఐ కిరణ్ సిబ్బందితో కలిసి వెళ్లాడు. పోలీసులను చూడగానే ఖయ్యూం రైలు పట్టాల మీదుగా పరిగెత్త సాగాడు. డీఐ కిరణ్, సిబ్బంది కలిసి అతడి వెంట పరిగెత్తి సినిమా స్టైల్‌లో ఛేజింగ్ చేసి పట్టుకున్నారు.

News October 25, 2025

NRPT: క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపు ప్రారంభించిన ఎమ్మెల్యే

image

నారాయణపేట జిల్లా ఆసుపత్రిలో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపును ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి శనివారం ప్రారంభించారు. స్క్రీనింగ్ పరీక్షలను పరిశీలించిన ఆమె, మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. క్యాంపు నిర్వాహకులను ఎమ్మెల్యే అభినందించారు. ఆసుపత్రి సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.