News December 13, 2024
బంగారం అపహరించిన దొంగలను పట్టుకున్న కరీంనగర్ పోలీసులు
బంగారం అపహరించిన దొంగలను కరీంనగర్ పోలీసులు పట్టుకున్నారు. జగిత్యాల జిల్లా కథలపూర్ మండలం బొమ్మన గ్రామానికి చెందిన హేమశ్రీ బుధవారం కరీంనగర్లో పెళ్లి వేడుకకు హాజరై తిరుగు ప్రయాణంలో 10 తులాల బంగారు ఆభరణాల కలిగిన బ్యాగును పొగొట్టుకుంది. KNR పోలీసులు చాకచక్యంగా దొంగను పట్టుకొని బాధితురాలికి బంగారాన్ని అందజేశారు. ఇన్స్పెక్టర్ కోటేశ్వర్, క్రైమ్ కానిస్టేబుళ్లు కుమార్, సంపత్లను సిపి అభినందించారు.
Similar News
News January 21, 2025
రేపు కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్న మంత్రి ఉత్తమ్
రేపు నీటిపారుదల మరియు పౌర సరఫరాలశాఖ మంత్రి జిల్లా ఇన్ఛార్జి, మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు. తిమ్మాపూర్ మండలం రేణికుంట గ్రామంలో నిర్వహించే గ్రామసభలో మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి పాల్గొంటారు. అనంతరం గంగాధర మండలంలో నిర్వహించనున్న గ్రామసభ పాల్గొంటారు. మంత్రి పర్యటన నేపథ్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.
News January 21, 2025
ఈనెల 24న కరీంనగర్కు కేంద్రమంత్రి మనోహర్లాల్ ఖట్టర్
కేంద్ర పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణశాఖ మంత్రి మనోహర్లాల్ ఖట్టర్ ఈనెల 24న కరీంనగర్లో పర్యటించనున్నారు. ఆయన పర్యటన సందర్భంగా కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ కుమార్, మేయర్ సునీల్ రావు, మున్సిపల్ కమిషనర్ కరీంనగర్ పట్టణంలోని స్టేడియం కాంప్లెక్స్, హౌసింగ్ బోర్డు వాటర్ ట్యాంక్, కుమార్వాడి గవర్నమెంట్ స్కూల్, హౌజింగ్ బోర్డులో నిర్వహించబోయే బహిరంగ సభా స్థలి, డంప్ యార్డ్ను పరిశీలించారు.
News January 21, 2025
AI టెక్నాలజీని వేగవంతం చేస్తాం: మంత్రి శ్రీధర్ బాబు
సాంబానోవా సిస్టమ్స్ ప్రతినిధులతో మంత్రి శ్రీధర్ బాబు సమావేశం అయ్యారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీ ముందుకు వచ్చినందుకు ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు. AI మౌలిక సదుపాయాల సామర్థ్యాలను అభివృద్ధి చేయడంలో కలిసి పనిచేస్తున్నందుకు ఆనందంగా ఉన్నారన్నారు. ఈ కంపెనీ భాగస్వామ్యంతో తెలంగాణలో అత్యాధునిక AI టెక్నాలజీని వేగవంతం చేస్తామన్నారు.