News February 9, 2025
బంగారుపాల్యం: ప్రాణం తీసిన ఈత సరదా

ఈత సరదా ఓ యువకుడి ప్రాణాలు తీసింది. ఈ ఘటన బంగారుపాల్యం మండలం మొగిలిలో చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. ఫిబ్రవరి 7న సెల్వరాజ్ స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లాడు. ఈత రాకపోయిన చెరువులో దిగడంతో గల్లంతయ్యాడు. రెండు రోజులు సీఐ శ్రీనివాసులు ఆధ్వర్యంలో అగ్నిమాపక దళం తీవ్రంగా శ్రమించి మృతదేహాన్ని చెరువు నుంచి ఆదివారం వెలికి తీశారు. మృతుడి తల్లి లక్ష్మి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News April 17, 2026
3,106 చెరువుల్లో ఉపాధి పనులు: చిత్తూరు కలెక్టర్

‘జలధార-నీటి భద్రత’ పనులతో చిత్తూరు జిల్లాలో భూగర్భ జలమట్టం పెరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. 3,106 చెరువుల్లో ఉపాధి హామీ పథకం కింద పనులు చేపట్టాలని సూచించారు. నీటి నిల్వలు పెంపు, సాగునీటి బలోపేతం, కరవు నివారణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి ఫీల్డ్ అసిస్టెంట్కు 3 చెరువులు కేటాయించి, అధికారులు బాధ్యతగా పనిచేయాలని ఆదేశించారు.
News April 16, 2026
చిత్తూరు జిల్లాలో కొత్త కార్యక్రమం

చిత్తూరు జిల్లాలో భూగర్భ జలాల పెంపే లక్ష్యంగా ప్రభుత్వం జలధార కార్యక్రమాన్ని అమలు చేయనుంది. ఇందుకోసం 100 రోజుల ప్రణాళికకు శ్రీకారం చుట్టారు. జిల్లాలో 3,106 చెరువులు ఉన్నాయి. జలధార కార్యక్రమాన్ని నాలుగు దశల్లో అమలు చేస్తామని అధికారులు తెలుపుతున్నారు. ఇందులో 15 మీటర్ల కంటే ఎక్కువ లోతున్న మండలాలకు ప్రాధాన్యమిచ్చి.. దానిని 3 నుంచి 6 మీటర్లకు తీసుకురావడమే లక్ష్యంగా పనులు చేస్తారు.
News April 16, 2026
చిత్తూరు జిల్లాలో కొత్త కార్యక్రమం

చిత్తూరు జిల్లాలో భూగర్భ జలాల పెంపే లక్ష్యంగా ప్రభుత్వం జలధార కార్యక్రమాన్ని అమలు చేయనుంది. ఇందుకోసం 100 రోజుల ప్రణాళికకు శ్రీకారం చుట్టారు. జిల్లాలో 3,106 చెరువులు ఉన్నాయి. జలధార కార్యక్రమాన్ని నాలుగు దశల్లో అమలు చేస్తామని అధికారులు తెలుపుతున్నారు. ఇందులో 15 మీటర్ల కంటే ఎక్కువ లోతున్న మండలాలకు ప్రాధాన్యమిచ్చి.. దానిని 3 నుంచి 6 మీటర్లకు తీసుకురావడమే లక్ష్యంగా పనులు చేస్తారు.


