News September 20, 2024

బంగారుపాళ్యం నుంచే దండయాత్రగా మారింది: లోకేశ్

image

కుప్పం నుంచి చేపట్టిన తన యువగళం యాత్ర బంగారుపాళ్యం నుంచి దండయాత్రగా మారిందని మంత్రి నారా లోకేశ్ అన్నారు. ‘యువగళాన్ని అడ్డుకునేందుకు ఆనాటి ప్రభుత్వం జీవో తెచ్చి అడ్డంకులు సృష్టించింది. అయినా భయపడలేదు. నాపై 23 కేసులు నమోదు చేశారు. పాదయాత్రలో నా దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరించేందుకు సూపర్-6 పథకాలు ఉపయోగపడతాయి. సీఎం చంద్రబాబుతో చర్చించి వాటిని అమలు చేస్తా’ అని లోకేశ్ చెప్పారు.

Similar News

News October 22, 2025

అధికారులు అప్రమత్తంగా ఉండాలి: చిత్తూరు కలెక్టర్

image

చిత్తూరు జిల్లాలో విస్తారమైన వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కలెక్టర్ సుమిత్ కుమార్ జిల్లాస్థాయి అధికారులతో అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలోని ప్రాజెక్టుల పరిస్థితి, ప్రమాదకర చెరువుల పరిస్థితిపై సమీక్షించారు. క్షేత్రస్థాయిలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. పోలీస్, రెవెన్యూ, వైద్య అధికారులతో ప్రత్యేకంగా సమీక్షించారు.

News October 22, 2025

చిత్తూరులో కంట్రోల్ రూమ్

image

చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సుమిత్ కుమార్ కోరారు. జిల్లాలో కుండపోత వర్షాలు కురుస్తాయన్నారు. లోతట్టు ప్రజలు వాగులు, వంకల వైపు వెళ్లరాదని సూచించారు. అత్యవసరమైతే ప్రజలు బయటకు రావాలని కోరారు. వర్షాలతో ఏదైనా ఇబ్బంది ఎదురైతే కంట్రోల్ రూము నంబర్లు 9491077325, 08572 242777కు కాల్ చేయాలని కోరారు.

News October 22, 2025

చిత్తూరు జిల్లాలో వర్షపాతం వివరాలు ఇలా..!

image

చిత్తూరు జిల్లాలో గడిచిన 24 గంటల్లో 28 మండలాల్లో వర్షాలు కురిశాయి. అత్యధికంగా విజయపురంలో 20.2 మిమీ, అత్యల్పంగా యాదమరిలో 1.8 మిమీ వర్షపాతం నమోదైంది. గుడిపాలలో 14.2, ఐరాలలో 13.2, పూతలపట్టులో 9.4, పెద్దపంజాణిలో 9.2, పాలసముద్రంలో 8.6, పులిచెర్లలో 7.6, గంగాధరనెల్లూరులో 8.2, పలమనేరు, సోమల మండలాల్లో 6.8 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది.