News January 25, 2025

బంజారాహిల్స్‌‌లో రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి

image

బంజారాహిల్స్‌‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. క్యాన్సర్ ఆస్పత్రి వద్ద ఫుట్‌పాత్‌ మీదకు కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో అక్కడే నిద్రిస్తున్న ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే కారును వదిలిపెట్టి అందులో ఉన్నవారు పారిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు స్పాట్ వద్దకు చేరుకున్నారు. బాధితులను ఆస్పత్రికి తరలించారు. కారు నంబర్ ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News November 17, 2025

బుట్టాయగూడెం: పదో తరగతి పరీక్షా కేంద్రం తనిఖీ

image

బుట్టాయగూడెం జడ్పీ హైస్కూల్ ప్లస్‌ను ఏలూరు జిల్లా అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఆర్. ఆశాలత సోమవారం సందర్శించారు. రాబోయే పదో తరగతి పబ్లిక్ పరీక్షా కేంద్ర ఏర్పాట్లను ఆమె పరిశీలించారు. విద్యార్థులకు కూర్చునే ఏర్పాట్లు, గాలి, వెలుతురు, తాగునీటి సౌకర్యం, సీసీటీవీ అమరికలతో పాటు ఇతర ప్రమాణాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు.

News November 17, 2025

బుట్టాయగూడెం: పదో తరగతి పరీక్షా కేంద్రం తనిఖీ

image

బుట్టాయగూడెం జడ్పీ హైస్కూల్ ప్లస్‌ను ఏలూరు జిల్లా అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఆర్. ఆశాలత సోమవారం సందర్శించారు. రాబోయే పదో తరగతి పబ్లిక్ పరీక్షా కేంద్ర ఏర్పాట్లను ఆమె పరిశీలించారు. విద్యార్థులకు కూర్చునే ఏర్పాట్లు, గాలి, వెలుతురు, తాగునీటి సౌకర్యం, సీసీటీవీ అమరికలతో పాటు ఇతర ప్రమాణాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు.

News November 17, 2025

ఒకే కుటుంబంలో 18 మంది మృతి

image

సౌదీలో ఘోర <<18310005>>బస్సు<<>> ప్రమాదం HYDలో పెను విషాదాన్ని నింపింది. మృతులంతా HYD వాసులే కాగా రాంనగర్‌లోని నసీరుద్దీన్ ఫ్యామిలీకి చెందిన 18 మంది మరణించడం తీవ్రంగా కలిచివేస్తోంది. నసీరుద్దీన్ 18 మంది కుటుంబ సభ్యులతో కలిసి ఉమ్రా యాత్రకు వెళ్లారు. ఆయన కుమారుడు సిరాజుద్దీన్ మాత్రం ఉద్యోగరీత్యా USలో ఉంటున్నాడు. ఇప్పుడు ఆ ఫ్యామిలీలో అతనొక్కడే మిగిలాడని వారి బంధువులు Way2Newsకు వెల్లడించారు.