News March 8, 2025

బండి సంజయ్‌ని విరాట్ కోహ్లీతో పోలుస్తూ ఫ్లెక్సీలు

image

కరీంనగర్ బీజేపీలో ఎమ్మెల్సీ గెలుపు ఉత్సాహం కొనసాగుతోంది. నగరంలో వివిధ ప్రాంతాల్లో శనివారం బండి సంజయ్‌ను విరాట్ కోహ్లీ పోలుస్తూ ఫ్లెక్సీలను అభిమానులు ఏర్పాటు చేశారు. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల గెలుపును క్రికెట్లో టీమ్ ఇండియా గెలుపుతో బండి సంజయ్ అభివర్ణించారు. బండి సంజయ్‌ని బీజేపీలో కోహ్లీగా అభివర్ణిస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

Similar News

News March 10, 2025

కరీంనగర్ జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు

image

కరీంనగర్ జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో జమ్మికుంట 38.3°C, గంగాధర 37.6, ఖాసీంపేట 37.2, కొత్తపల్లి-ధర్మారం 37.0, తాంగుల, ఇందుర్తి 36.4, ఈదులగట్టేపల్లి 36.3, వీణవంక 36.2, నుస్తులాపూర్ 36.0, రేణికుంట 35.4, బురుగుపల్లి, పోచంపల్లి 35.0, చిగురుమామిడి 34.9, గుండి 34.8, అర్నకొండ 34.5, గంగిపల్లి, మల్యాల 34.4, గట్టుదుద్దెనపల్లె 34.3, బోర్నపల్లి 34.1, తాడికల్ 34.0°C గా నమోదైంది.

News March 10, 2025

KNR: ఈ సోమవారం ప్రజావాణి యథాతథం: కలెక్టర్

image

ప్రతి సోమవారం కరీంనగర్ కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం సోమవారం నుంచి యథావిధిగా కొనసాగుతుందని కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా రద్దు చేయబడిన ప్రజావాణిని తిరిగి సోమవారం నుంచి ప్రారంభించనున్నట్లు తెలిపారు. ప్రజలు తమ అర్జీలను సమర్పించాలని సూచించారు.

News March 10, 2025

భారత్ విక్టరీపై కేంద్రమంత్రి బండి ట్వీట్

image

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 లో కప్ సాధించిన టీమ్ ఇండియాకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ అభినందనలు తెలిపారు. టీమిండియా..అన్ స్టాపేబుల్, అన్ బీటేబుల్, అన్ ఫర్గటబుల్.. కంగ్రాట్యులేషన్స్ టు ద మెన్ ఇన్ బ్లూ..ఫర్ మేకింగ్ ది నేషన్ ప్రౌడ్ అని ట్విటర్‌లో పోస్ట్ చేశారు. భారత జట్టు ఛాంపియన్స్‌గా ఆవిర్భవించడం గర్వకారణమని హర్షం వ్యక్తం చేశారు.

error: Content is protected !!