News March 4, 2025

బండ్లమ్మ సేవలో బాపట్ల కలెక్టర్

image

పిట్టలవానిపాలెం మండలం చందోలు గ్రామంలోని శ్రీ భగలాముఖి అమ్మవారి ఆలయంలో బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకట మురళి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగళవారం ఆలయానికి విచ్చేసిన ఆయనకు ఆలయ నిర్వహకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎంతో పవిత్రమైన పుణ్యక్షేత్రం చందోలు బండ్లమ్మ తల్లిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు.

Similar News

News November 13, 2025

రాష్ట్రస్థాయి స్విమ్మింగ్ పోటీల్లో మెరిసిన పల్నాడు స్విమ్మర్లు

image

విశాఖపట్నంలో ఈనెల 9, 10 తేదీల్లో జరిగిన ఎస్‌జి‌ఎఫ్‌ రాష్ట్ర స్థాయి స్విమ్మింగ్ చాంపియన్‌షిప్‌లో పల్నాడు జిల్లా స్విమ్మర్లు కే. శివ సాకేత్, లోహిత్‌ ప్రతిభ కనబరిచారు. శివ సాకేత్‌ 200 మీ. బటర్‌ఫ్లైలో బంగారు, 50, 100 మీ. బటర్‌ఫ్లైలో రెండు కాంస్య పతకాలు, లోహిత్‌ 200 మీ. బటర్‌ఫ్లైలో కాంస్య పతకం సాధించారని కోచ్‌ సురేశ్ తెలిపారు. అనంతరం పలువురు వారిని అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.

News November 13, 2025

NLG: 1160 మంది విద్యార్థులకు 794 మంది పాస్!

image

MGU పరిధిలోని పీజీ 2వ సెమిస్టర్ ఫలితాలను ఉపకులపతి ఆచార్య ఖాజా అల్తాఫ్ హుస్సేన్ విడుదల చేశారు. సెప్టెంబర్ నెలలో నిర్వహించిన పరీక్షలకు మొత్తం 1160 మంది విద్యార్థులు హాజరుకాగా 794 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు, ఫలితాల పూర్తి వివరాలను విశ్వవిద్యాలయ వెబ్ సైట్‌లో పొందుపరిచినట్లు సిఓఈ డా. ఉపేందర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య అల్వాల రవి పాల్గొన్నారు.

News November 13, 2025

ఈ నెల 15న స్వర్ణ ఆంధ్ర.. స్వచ్ఛ ఆంధ్ర: కలెక్టర్

image

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పరిశుభ్రత, ప్రజా పరిశుభ్రత, పౌరుల భాగస్వామ్యం విలువలను ప్రోత్సహించే లక్ష్యంతో ఈ నెల 15న జిల్లాలో స్వర్ణ ఆంధ్ర.. స్వచ్ఛ కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ షణ్మోహన్ గురువారం తెలిపారు. నవంబర్ నెల మూడో శనివారం వ్యక్తిగత & సమాజ పరిశుభ్రత ఇతివృత్తంతో చేపట్టే ఈ కార్యక్రమాలను జిల్లా అంతటా నిర్వహించాలని ఆయన అధికారులను ఆదేశించారు.