News December 17, 2024
బట్టి చదువులు వద్దు.. ఇష్టంతో చదువండి: కలెక్టర్
బట్టి చదువులకు స్వస్తి పలికి ఇష్టంతో చదివి ఉన్నత విద్యావంతులవ్వాలని జిల్లా కలెక్టర్ విద్యార్థులకు వివరించారు. మంగళవారం ఆచంట మండలం ఏ. వేమవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను పరిశీలించారు. పదవ తరగతిలో మంచి ఉత్తీర్ణత సాధించాలని అన్నారు. ఈసందర్భంగా మధ్యాహ్నం భోజనం చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఎంపీపీ సూర్య కుమారి, సర్పంచ్ జక్కంశెట్టి చంటి, ఆర్డిఓ దాసిరాజు, తాసిల్దార్ కనకరాజు పాల్గొన్నారు.
Similar News
News January 22, 2025
ప.గో జిల్లా పాడి రైతులకు గమనిక
ప.గో జిల్లాలో జనవరి 31వ తేదీ వరకు పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఉచిత పశు ఆరోగ్య శిబిరాలను నిర్వహిస్తామని కలెక్టర్ నాగరాణి వెల్లడించారు. పశువులకు పరీక్షలు చేసి.. గర్భకోశ మందులు, వ్యాధి నిరోధక టీకాలు, నట్టల నివారణ మందులు పంపిణీ చేస్తామన్నారు. పశు వ్యాధి నిర్ధారణ పరీక్షలపై అవగాహన కల్పిస్తామని చెప్పారు. ఈ అవకాశాన్ని జిల్లాలోని పశు రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
News January 21, 2025
Photo Of The Day: భార్యాభర్త ఫైరింగ్
ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం తడికలపూడిలో ఇవాళ పోలీస్ ఫైరింగ్ శిక్షణ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఏలూరు ఎస్పీ శివ ప్రతాప్ కిషోర్, జిల్లా జాయింట్ కలెక్టర్ ధాత్రి రెడ్డి పాల్గొన్నారు. భార్యాభర్తలైన ఎస్పీ, జేసీ ఒకేసారి ఇలా పక్కపక్కనే నిలబడి ఫైరింగ్ చేశారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
News January 21, 2025
ప.గో. కోళ్లకు అంతు చిక్కని వైరస్.. లక్షకు పైగా మృతి
కోళ్లకు అంతుచిక్కని వైరస్ సోకి మృత్యువాత పడటంతో కోళ్ల పెంపకందారులు ఆందోళన చెందుతున్నారు. కొన్ని రోజులుగా జిల్లాలో లక్షకు పైనే కోళ్లు మృతి చెందినట్లు చెబుతున్నారు. పందెం కోళ్లకు సైతం వైరస్ సోకి చనిపోవడంతో ఆర్థికంగా నష్టపోతున్నామని ఆవేదన చెందుతున్నారు. ఉదయం ఆరోగ్యంగా కనిపించిన కోళ్లు సాయంత్రానికి మృతి చెందుతున్నాయని చెబుతున్నారు. వైరస్ ప్రభావంతో అమ్మకాలు తగ్గి, ధరలు పతనమవుతున్నాయని అంటున్నారు.