News February 10, 2025

బడా వ్యాపారవేత్తలకు అనుకూలంగా కేంద్ర బడ్జెట్: తమ్మినేని

image

ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ సామాన్య ప్రజలకు వ్యతిరేకంగా, బడా వ్యాపారవేత్తలకు అనుకూలంగా ఉందని ఖమ్మం మాజీ ఎంపీ, సీపీఎం పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం అన్నారు. ప్రజా వ్యతిరేక బడ్జెట్‌ను నిరసిస్తూ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఈ రోజు హైద్రాబాద్ ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. కేంద్రం తెలంగాణను విస్మరించిందని, రైతును, వ్యవసాయనికి మరచినదని అన్నారు.

Similar News

News February 23, 2026

ఖమ్మం జిల్లాలో అడుగంటుతున్న భూగర్భ జలాలు!

image

ఖమ్మం జిల్లాలో వేసవి రాకముందే భూగర్భ జలాలు వేగంగా పడిపోతున్నాయి. కేవలం నెల రోజుల్లోనే 2 అడుగుల మేర నీటిమట్టం తగ్గడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా ఎర్రుపాలెం, మధిర, కామేపల్లి మండలాల్లో పరిస్థితి తీవ్రంగా ఉంది. విచ్చలవిడి వాడకం, నీటి పొదుపు లేకపోవడమే ఇందుకు కారణమని అధికారులు చెబుతున్నారు. మే నాటికి జల సంక్షోభం మరింత పెరిగే ప్రమాదం ఉందని, ప్రజలు నీటిని పొదుపుగా వాడాలని భూగర్భజల శాఖ హెచ్చరిస్తోంది.

News February 23, 2026

ఖమ్మంలో తగ్గిన గాలి నాణ్యత.. 156కు చేరిన AQI

image

ఖమ్మం జిల్లా కేంద్రంలో వాయు కాలుష్యం కోరలు చాస్తోంది. ఆదివారం (FEB 22) నగరంలో వాయు నాణ్యత సూచీ (AQI) ఒక్కసారిగా 156కు చేరింది. గాలిలో PM2.5, PM10 వంటి సూక్ష్మ ధూళి కణాలు ప్రమాదకర స్థాయికి చేరడమే ఇందుకు ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. గాలి నాణ్యత ‘అనారోగ్యకర’ స్థాయికి చేరడంతో చిన్నారులు, వృద్ధులు శ్వాసకోశ ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. 100 లోపు AQI ఉంటే నాణ్యమైన గాలిగా తేల్చారు.

News February 22, 2026

ఖమ్మం: ఈ నెల 24న లబ్ధిదారుల ఎంపిక

image

ఇందిరమ్మ మైనార్టీ మహిళా యోజన పథకాలకు దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల ఎంపికను ఈ నెల 24న నిర్వహించనున్నట్లు కేఎంసీ డిప్యూటీ కమిషనర్ కె.శ్రీనివాసరావు తెలిపారు. ఖమ్మంలోని భక్తరామదాసు కళాక్షేత్రంలో ఉదయం 11గంటలకు డ్రా పద్ధతిలో ఈ ఎంపిక ప్రక్రియ జరుగుతుందని పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకున్న మైనార్టీ మహిళలు తమ వెంట ఒరిజినల్ ధ్రువీకరణ పత్రాలతో నిర్ణీత సమయానికి హాజరు కావాలని ఆయన సూచించారు.