News June 20, 2024

బడిబాట ద్వారా సత్ఫలితాలు 

image

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రొఫెసర్
జయశంకర్ బడిబాట కార్యక్రమం సత్ఫలితాలనిచ్చింది. ఖమ్మం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాల సంఖ్య పెంచేందుకు వివిధ రకాల కార్యక్రమాలు చేపట్టారు. ఈ నెల 6 నుంచి బడిబాట కార్యక్రమం ద్వారా పిల్లలను గుర్తించి 12వ తేదీ నుంచి 19వ తేదీ వరకు రోజుకొక కార్యక్రమం నిర్వహించారు. మొత్తంగా బుధవారం నాటికి 10,065 మంది విద్యార్థులు సర్కారు స్కూళ్లలో ప్రవేశాలు పొందారు.

Similar News

News November 27, 2025

ఖమ్మం: మీడియా సెంటర్ ప్రారంభించిన అ.కలెక్టర్

image

స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా కలెక్టరేట్ మొదటి అంతస్తులోని ఎఫ్-3లో ఉన్న డీపీఆర్ఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్‌ను, మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ సెల్‌ను అదనపు కలెక్టర్ పి.శ్రీనివాస రెడ్డి గురువారం ప్రారంభించారు. ఎన్నికలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీడియా సెంటర్ ద్వారా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు అందించాలని సూచించారు.

News November 27, 2025

ఖమ్మం: 50 వేల మంది మహిళలకు ‘ఉల్లాస్‌’ వెలుగులు

image

15 ఏళ్లు నిండిన నిరక్షరాస్యులైన మహిళలకు సంపూర్ణ అక్షరాస్యత కల్పించేందుకు కేంద్రం ‘ఉల్లాస్‌’ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం కింద జిల్లాలోని డ్వాక్రా మహిళల్లో 50 వేల మందికి పైగా అక్షరాస్యులు కానీ వారిని గుర్తించారు. వీరికి చదవడం, రాయడంతో పాటు జీవన నైపుణ్యాలు నేర్పడానికి ప్రతి 10 మందికి ఒక వలంటీర్‌ను నియమించి, అంగన్వాడీ కేంద్రాలు, పంచాయతీల్లో శిక్షణ ఇస్తున్నారు.

News November 27, 2025

ఖమ్మం: నేటి నుంచి తొలి విడత నామినేషన్ల స్వీకరణ

image

ఖమ్మం జిల్లాలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన సన్నాహాలు పూర్తయ్యాయి. మొదటి దశలో ఏడు మండలాల్లోని 192 గ్రామ పంచాయతీలకు నేటి నుంచి ఈ నెల 29 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. కొణిజర్ల, వైరా, మధిర, రఘునాథపాలెం, బోనకల్, చింతకాని, ఎర్రుపాలెం మండలాల్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి. జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశాల మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.