News May 23, 2024
బడి కొత్తదనం.. మారుతున్న రూపురేఖలు

ఖమ్మం జిల్లాలోని పాఠశాలల్లో కనీస మౌలిక వసతులైన టాయిలెట్ల నిర్మాణం, తాగునీరు, విద్యుత్ సౌకర్యాల కల్పనపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఈమేరకు ప్రణాళిక సిద్ధం చేసి పనులు చేపడుతుండగా.. అధికారులు నిత్యం పర్యవేక్షిస్తున్నారు. ఇందులో ఇప్పటికే 217పాఠశాలల్లో పనులు పూర్తి కావడంతో కళకళలాడుతున్నాయి. మిగతా పాఠశాలల్లో కూడా విద్యాసంవత్సరం ప్రారంభమయ్యే నాటికి పూర్తిచేయాలనే లక్ష్యంతో అధికారులు ఉన్నారు.
Similar News
News December 12, 2025
KMM: తొలివిడతలో సత్తా చాటిన కాంగ్రెస్ అభ్యర్థులు

ఖమ్మం జిల్లాలో జరిగిన తొలి విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు సత్తా చాటారు. తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో (7 మండలాల్లో) కాంగ్రెస్ పార్టీ-136, బీఆర్ఎస్-34, సీపీఐ-6, సీపీఎం-10, టీడీపీ-2, ఇండిపెండెంట్-4 స్థానాల్లో విజయం సాధించారు. అధికంగా వైరా మండలంలో మొత్తం 22 గ్రామ పంచాయితీల్లో 20 స్థానాల్లో కాంగ్రెస్, సీపీఎం-1, బీఆర్ఎస్- 1 స్థానాల్లో నిలిచారు.
News December 12, 2025
ఖమ్మం జిల్లాలో FINAL పోలింగ్ శాతం

ఖమ్మం జిల్లాలో 192 పంచాయతీల్లో గురువారం మొదటి విడత ఎన్నికలు జరిగాయి. కాగా మధ్యాహ్నం ఒంటి గంటకు పోలింగ్ ముగియగా సమయానికి కేంద్రంలోపలికి వచ్చి క్యూలైన్లో నిలబడిన వారందరికీ ఓటేసేందుకు అధికారులు అవకాశం కల్పించారు. దీంతో జిల్లాలో ఫైనల్గా 90.08 శాతం పోలింగ్ నమోదైందని అధికారులు ప్రకటించారు.
News December 12, 2025
H.I.V వ్యాక్సిన్ పట్ల సంపూర్ణ అవగాహన కల్పించాలి: జిల్లా కలెక్టర్

ఖమ్మం: హెచ్.పి.వి. వ్యాక్సిన్ పట్ల ప్రజలలో అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. ఖమ్మం జడ్పి కార్యాలయంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన హెచ్.పి.వి. వ్యాక్సినేషన్ శిక్షణ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. 14 సంవత్సరాల వయస్సు గల బాలికల్లో సర్వైకల్ క్యాన్సర్ నివారించడానికి బాలికలకు ఆరోగ్య భద్రత కల్పించాల్సిన అవసరం వుందని పేర్కొన్నారు.


