News April 11, 2025

బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి ఫూలే: కలెక్టర్

image

వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి కృషిచేసిన వ్యక్తి జ్యోతిరావు ఫూలే అని విశాఖ కలెక్టర్ హరేంధిర ప్రసాద్ అన్నారు. గ్రీన్‌పార్క్ జంక్షన్ వద్ద గల శుక్రవారం ఫూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బాలబాలికల పాఠశాలల ఏర్పాటు, వెనుకబడిన వర్గాల అభ్యున్నతికై ఆయన చేసిన కృషి వర్ణణాతీతమని ప్రశంసించారు. అనంతరం బీసీ, కాపు కార్పొరేషన్ల ద్వారా స్వయం ఉపాధి సబ్సిడీ చెక్కు అందించారు.

Similar News

News October 17, 2025

విశాఖ: చోరీ కేసులో అక్కాచెల్లెలు అరెస్ట్

image

చోరీ కేసులో అక్కాచెల్లెలును విశాఖ పోలీసులు అరెస్ట్ చేశారు. రాజీవ్‌నగర్‌లో ఉంటున్న నరసింహరావు ఇంట్లో అనకాపల్లి జిల్లా సోమలింగాపురానికి చెందిన నాగమణి పనిచేస్తోంది. ఈనెల ఒకటో తేదీన బీరువాలో చెవి దిద్దులు, పచ్చలహారం నాగమణి దొంగతనం చేసి తన చెల్లెలు మంగకు ఇచ్చింది. గమనించిన ఇంటి యజమాని నరసింగరావు దువ్వాడ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేపట్టి ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

News October 17, 2025

విశాఖ: అక్టోబర్ 18న స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమాలు

image

అక్టోబర్ 18న మూడవ శనివారం “CLEAN AIR” అనే కాన్సెప్ట్‌పై స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హ‌రేంధిర ప్రసాద్ గురువారం తెలిపారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో ఆ రోజు ఉదయం 6 గంటల నుంచి క్లీన్ ఎయిర్ కార్యక్రమం చేపట్టాలన్నారు. ఆరోజున శుభ్రత చర్యలు చేపట్టాలని జిల్లా అధికారులను ఆదేశిస్తూ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు.

News October 16, 2025

విశాఖ పోలీసుల ఫైన్లపై మీరేమంటారు..!

image

విశాఖలో గత 15నెలల్లోనే పోలీసులు 8.54 లక్షల ఈ-చలాన్‌లు జారీ చేసి రూ.46.4కోట్ల ఫైన్ విధించారు. ఇప్పటి వరకు రూ.13.39కోట్లు రాబట్టారు. నగరంలో 12 లక్షల వాహనాలు ఉండగా.. కొందరు సిగ్నల్‌ జంప్, ఓవర్‌ స్పీడ్‌, రాంగ్‌ రూట్‌ డ్రైవింగ్ చేస్తున్నారు. దీంతో ప్రమాదాలు జరిగి ప్రతి 2రోజులకు ముగ్గురు ప్రాణాలు కోల్పోతున్నారు.మరోవైపు షాపులు, రైతుబజార్ల వద్ద పార్క్‌ చేసిన వాహనాలకూ ఫైన్లు వేయడంపై విమర్శలు వస్తున్నాయి.