News April 11, 2025
బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి ఫూలే: కలెక్టర్

వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి కృషిచేసిన వ్యక్తి జ్యోతిరావు ఫూలే అని విశాఖ కలెక్టర్ హరేంధిర ప్రసాద్ అన్నారు. గ్రీన్పార్క్ జంక్షన్ వద్ద గల శుక్రవారం ఫూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బాలబాలికల పాఠశాలల ఏర్పాటు, వెనుకబడిన వర్గాల అభ్యున్నతికై ఆయన చేసిన కృషి వర్ణణాతీతమని ప్రశంసించారు. అనంతరం బీసీ, కాపు కార్పొరేషన్ల ద్వారా స్వయం ఉపాధి సబ్సిడీ చెక్కు అందించారు.
Similar News
News April 17, 2025
వైసీపీకి ముత్తంశెట్టి లక్ష్మీ ప్రియాంక రాజీనామా

జీవీఎంసీ 6వ వార్డు కార్పొరేటర్, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ కుమార్తె ముత్తంశెట్టి లక్ష్మీ ప్రియాంక YCPకి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాల రీత్యా పార్టీకి రాజీనామా చేస్తున్నానని అధినేత జగన్కు లేఖ పంపారు. అయితే ఆమె ఏ పార్టీలో చేరనున్నది అనేది తెలపలేదు. కాగా ఇవాళ ముగ్గురు YCP కార్పొరేటర్లు జనసేనలో చేరిన సంగతి తెలిసిందే. ఈ నెల 19న మేయర్పై అవిశ్వాసం పెట్టనున్న నేపథ్యంలో నంబర్ గేమ్ ఉత్కంఠగా మారింది.
News April 17, 2025
వాట్సాప్ గవర్నెన్స్ కరపత్రాన్ని ఆవిష్కరించిన ఎంపీ

రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన 9552300009 వాట్సాప్ నంబర్ ద్వారా అన్ని రకాల ప్రభుత్వ సేవలు సులభంగా పొందవచ్చని విశాఖ ఎంపీ శ్రీభరత్, కలెక్టర్ హరేంధిర ప్రసాద్ పేర్కొన్నారు. గురువారం విశాఖ కలెక్టరేట్లో వాట్సాప్ గవర్నెన్స్ కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ నెంబరుకు హాయ్ అని మెసేజ్ పెట్టి ప్రజలకు కావాల్సిన సేవను ఎంపిక చేసుకోవచ్చన్నారు.
News April 17, 2025
కేంద్ర హోంమంత్రి చేతులు మీదుగా పురస్కారం అందజేత

సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ రైజింగ్ డే పరేడ్ గురువారం మద్యప్రదేశ్లో జరిగింది. ఈ వేడుకలలో విశాఖకు చెందిన సీఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అరాధ్యుల శ్రీనివాస్కు ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ ఫర్ డిస్టింగ్విష్డ్ సర్వీస్ అవార్డు లభించింది. ఈ అవార్డును శ్రీనివాస్కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా అందజేశారు. 34 ఏళ్లకు పైగా దేశ భద్రతకు ఆయన చేసిన సేవలకి గాను ఈ పురస్కారం లభించింది.