News March 20, 2025

బడ్జెట్.. ఉమ్మడి కరీంనగర్‌కు కేటాయింపులు ఇలా..

image

రాష్ట్ర ప్రభుత్వం బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో KNR స్మార్ట్ సిటీ పనులకోసం రూ.179కోట్లు కేటాయించింది. అదేవిధంగా SUకి రూ.35కోట్లు, స్పోర్ట్స్ స్కూల్‌కు రూ.21కోట్లు, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌కు రూ.349.66కోట్లు, వరదకాలువల పనులకు 299.16కోట్లు, కాళేశ్వరం రూ.2,685కోట్లు, మానేరు ప్రాజెక్ట్‌కు రూ.లక్ష, బొగ్గులవాగు(మంథని)రూ.34లక్షలు, రామడుగు, గోదావరి బేసిన్‌కు రూ.2.23కోట్లను కేటాయించింది.

Similar News

News November 20, 2025

హిమాలయాలకే వెళ్తాం.. చాలామంది ట్రావెల్ డెస్టినేషన్ ఇదేనట!

image

‘అమెరికన్ ఎక్స్‌ప్రెస్ ట్రావెల్’ విడుదల చేసిన అత్యంత ప్రతిష్ఠాత్మక ‘ట్రెండింగ్ డెస్టినేషన్స్ 2026’ జాబితాలో హిమాలయాలు అగ్రస్థానంలో నిలిచాయి. ఆధ్యాత్మికత, అద్భుతమైన ప్రకృతి సౌందర్యం కలగలిసిన ఈ పర్వత శ్రేణులు వచ్చే ఏడాది ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఎక్కువమంది యాత్రికులను ఆకర్షించనున్నాయని సంస్థ పేర్కొంది. ఇది భారత హిమశిఖరాలకు దక్కిన గొప్ప అంతర్జాతీయ గౌరవమని నెటిజన్లు కొనియాడుతున్నారు.

News November 20, 2025

ANU: రీవాల్యుయేషన్ ఫలితాలు విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో గత ఏప్రిల్, ఫిబ్రవరిలో విడుదల చేసిన LLB 5 సంవత్సరాల రీవాల్యుయేషన్ ఫలితాలను పరీక్షల నియంత్రణ అధికారి ఆలపాటి శివప్రసాదరావు గురువారం విడుదల చేశారు. LLB 5 సంవత్సరాల ఫస్ట్ సెమిస్టర్, 3వ సెమిస్టర్ రీవాల్యుయేషన్ ఫలితాలను విడుదల చేసినట్లు ఆయన తెలిపారు. పూర్తి వివరాల కోసం వర్సిటీలోని సంబంధిత అధికారులను సంప్రదించాలన్నారు.

News November 20, 2025

క్షణికావేశంలో ఆత్మహత్యలు.. ఒక్కసారి ఆలోచించండి.!

image

అల్లారుముద్దుగా చూసుకున్న కూతురు పట్టాలపై <<18338200>>మాంసపు ముద్దలా<<>> మారిన వేళ.. బుడిబుడి నడకలు, చిలిపి చేష్టలకు సంబరపడ్డ తల్లిదండ్రులు తెగిపడ్డ తమ బిడ్డ శరీర భాగాలను చూసి తట్టుకోగలరా? కుప్పం(M)లో అనూష.. పేరంట్స్ మందలించారని తనువు చాలించింది. చిన్న చిన్న కారణాలకు ఎంతో మంది క్షణికావేశంలో ప్రాణాలు తీసుకుంటున్నారు. ప్రతి ఒక్కరికి విద్యార్థి దశలోనే కౌన్సెలింగ్‌ ఇస్తే ఇలాంటివి జరగవని పలువురు అంటున్నారు.