News July 26, 2024
బడ్జెట్ కేటాయింపులో సీతారామకు ఊతం

రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ప్రవేశపెట్టిన 2024-25 బడ్జెట్లో సీతారామ ప్రాజెక్టుకు రూ.799 కోట్లు కేటాయించారు. ఇందులో పంప్ హౌస్లు, డిస్ట్రిబ్యూటరీ కెనాళ్లు తదితర పనుల కోసం రూ.687 కోట్లు కేటాయించగా.. సీతమ్మసాగర్ బ్యారేజీ, దాని అనుబంధ పనుల కోసం రూ.111 కోట్లు బడ్జెట్ పద్దుగా మంత్రి మల్లు భట్టివిక్రమార్క చూపించారు. ఈ నిధులను అత్యవసరంగా చేపట్టాల్సిన పనులకు వినియోగించనున్నారు.
Similar News
News November 25, 2025
ఖమ్మం: అంతా ‘మొంథా’ర్పణం

ఖమ్మం జిల్లాలో ‘మొంథా’ తుపాను కారణంగా పంటలకు జరిగిన నష్టాన్ని వ్యవసాయశాఖ సర్వేచేసి తుది నివేదిక విడుదల చేసింది. జిల్లాలో 17మండలాల్లో 4,268మంది రైతులకు చెందిన 1, 710.72హెక్టార్లలో పంటలకు నష్టం జరిగిందని తేల్చారు. 1,499.43 ఎకరాల్లో వరి, 115.82హెక్టార్లలో పత్తికి నష్టం వాటిల్లిందిని కలెక్టర్కు నివేదిక అందజేశారు. అత్యధికంగా కూసుమంచి డివిజన్లో 766.12 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు.
News November 25, 2025
ఎన్పీడీసీఎల్లో 17 మంది ఇంజనీర్లకు పదోన్నతులు

ఎన్పీడీసీఎల్ (NPDCL) సీఎండీ వరుణ్ రెడ్డి సంస్థలోని పలువురు ఇంజనీర్లకు పదోన్నతులు కల్పిస్తూ బదిలీ ఉత్తర్వులు జారీ చేశారు. ఖమ్మం సర్కిల్ పరిధిలో ముగ్గురు ఏడీఈలకు డీఈలుగా, 14 మంది అసిస్టెంట్ ఇంజనీర్లకు ఏడీఈలుగా పదోన్నతి లభించింది. పదోన్నతి పొందిన రాందాసు కార్పొరేట్ ఆఫీస్కు, రమేష్ వైరా డివిజన్కు బదిలీ అయ్యారు. ఈ చర్యతో విభాగాల పనితీరు మెరుగుపడుతుందని సంస్థ తెలిపింది.
News November 25, 2025
ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

∆} ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమం
∆} ఖమ్మం కలెక్టరేట్ ఎదుట సిపిఎం ధర్నా
∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి పర్యటన
∆} పలు శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం
∆} ఖమ్మం రూరల్ మండలంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సమావేశం
∆} నేలకొండపల్లి, తల్లాడ రైతు వేదికల్లో రైతు నేస్తం
∆} రైతులతో వైరా ఎమ్మెల్యే సమావేశం
∆} మధిర ఆంజనేయ స్వామి ఆలయం ప్రత్యేక పూజలు


