News February 2, 2025
బడ్జెట్ భేష్: మంత్రి సవిత

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో ప్రవేశపెట్టిన ఆర్థిక బడ్జెట్పై మంత్రి సవిత ప్రశంసలు కురించారు. బడ్జెట్లో ఏపీకి అధిక నిధులు కేటాయించినందుకు ప్రధాని మోదీకి, సీతారామన్కు ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. విశాఖ ఉక్కు, పోలవరానికి బడ్జెట్ ఊపిరిపోసిందని తెలిపారు.
Similar News
News December 9, 2025
క్రికెట్ చరిత్రలో ఒకేఒక్కడు.. రస్సెల్

విండీస్ ఆల్రౌండర్ రస్సెల్ చరిత్ర సృష్టించారు. T20లలో 5000+ రన్స్, 500+ సిక్సులు, 500+ వికెట్లు సాధించిన తొలి ప్లేయర్గా ఘనత సాధించారు. అన్ని దేశాల లీగ్లలో కలిపి రస్సెల్ 576 మ్యాచ్లు ఆడారు. మొత్తంగా 9,496 రన్స్, 972 సిక్సర్లు, 628 ఫోర్లు బాదారు. కాగా వ్యక్తిగతంగా 126 మంది 5000+ రన్స్, ఆరుగురు 500+ వికెట్లు, 10 మంది 500+ సిక్సర్లు బాదారు. కానీ ఇవన్నీ చేసిన ఒకేఒక్కడు రస్సెల్.
News December 9, 2025
డిసెంబర్ 9 లేకుంటే జూన్ 2 లేదు: కేటీఆర్

TG: తుది దశ తెలంగాణ ఉద్యమ ఫలితంగా రాష్ట్ర ఏర్పాటుకు తొలి అడుగుపడ్డ రోజు DEC 9 అని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR గుర్తుచేశారు. ‘అమరుల త్యాగం, KCR ఆమరణ నిరాహార దీక్షతో ఢిల్లీ పీఠం వణికింది. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు కేంద్రం ప్రకటించి నేటికి 16 ఏళ్లు. నవంబర్ 29(దీక్షా దివస్) లేకుంటే డిసెంబర్ 9(విజయ్ దివస్) లేదు. డిసెంబర్ 9 లేకుంటే జూన్ 2 లేదు. జై తెలంగాణ’ అని ట్వీట్ చేశారు.
News December 9, 2025
ప్రమాదంలో పద్మావతి అమ్మవారి ఆలయ పోటు కార్మికులు మృతి

నగరి పోలీస్ స్టేషన్ పరిధి తడకుపేట సమీపంలో రెండు కార్లు ఢీకొని <<18510891>>ముగ్గురు చనిపోయిన<<>> విషయం తెలిసిందే. మృుతల్లో ఇద్దరిని తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో పని చేసే పోటు కార్మికులు శంకర్, సంతానంగా గుర్తించారు. వీరు తిరుత్తణికి వెళ్లి స్వామి వారిని దర్శించుకుని వస్తుండగా ఈ ఘటన జరిగింది. ఇదే ప్రమాదంలో ఎదురుగా వచ్చిన కారులో వ్యక్తి సైతం మరణించాడు. పోలీసులు విచారణ చేపట్టారు.


