News March 11, 2025

బడ్జెట్ సమావేశాల్లో మహబూబ్‌నగర్ ఎంపీ

image

ఢిల్లీలో ప్రారంభమైన పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాల్లో మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ పాల్గొన్నారు. వచ్చే నెల ఏప్రిల్ 4 వరకు బడ్జెట్ సెషన్స్ సాగనున్నాయి. తొలిరోజు సమావేశాల్లో పాల్గొన్న మహబూబ్‌నగర్ ఎంపీ మాట్లాడుతూ.. తన పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి పలు ప్రతిపాదనలు సిద్ధం చేసుకున్నట్లు ఆమె తెలిపారు.

Similar News

News March 12, 2025

CM రేవంత్‌పై అసభ్యకర వ్యాఖ్యలు.. ఇద్దరు మహిళా జర్నలిస్టుల అరెస్ట్

image

TG: సీఎం రేవంత్‌పై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన ఇద్దరు మహిళా జర్నలిస్టులను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. రేవతి, తేజస్విని అనే మహిళలను అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. వీరి నుంచి రెండు ల్యాప్‌టాప్స్, ఫోన్లను సీజ్ చేశారు.

News March 12, 2025

NRPT: వార్డు ఆఫీసర్‌ను అభినందించిన కమిషనర్

image

నారాయణపేట మున్సిపాల్టీలో వార్డు ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్న వేణు నిన్న విడుదలైన గ్రూప్-2 ఫలితాల్లో 31వ ర్యాంకు సాధించి ఉద్యోగం సంపాదించాడు. దీంతో బుధవారం మున్సిపల్ కమిషనర్ బొగేశ్వర్లు వేణును శాలువాతో సన్మానించి అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. మునుముందు మరిన్ని ఉన్నత పదవులు సంపాదించాలని కోరారు. మున్సిపల్ సిబ్బంది వేణుకు మిఠాయిలు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు.

News March 12, 2025

నెల్లూరు: ‘ప్లాన్ తయారు చెయ్యడంలో శ్రద్ధ తీసుకోండి’ 

image

నియోజకవర్గ స్థాయి స్వర్ణాంధ్ర – 2047 ప్రణాళిక తయారు చేయడంలో నియోజకవర్గాల ప్రత్యేక అధికారులు అత్యంత శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆనంద్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో స్వర్ణాంధ్ర – 2047 యాక్షన్ ప్లాన్‌ను నియోజకవర్గ స్థాయిలో తయారు చేసేందుకు వర్క్ షాప్ నిర్వహించారు. GDDPపై వివిధ శాఖల జిల్లా అధికారులు, నియోజకవర్గ ప్రత్యేక అధికారులకు పాల్గొన్నారు.

error: Content is protected !!