News March 18, 2024

బత్తలపల్లిలో విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి

image

బత్తలపల్లిలోని తాడిపత్రి రోడ్డుకు ఉన్న వ్యవసాయ పొలంలో విద్యుదాఘాతంతో వ్యక్తి మృతిచెందాడు. నర్సింపల్లి రోడ్డు పక్కన ఉన్న వెంకటేశ్‌కు చెందిన వ్యవసాయ పొలంలో విద్యుత్ వైర్ల మరమ్మతుల కోసం ఓ వ్యక్తి స్తంభం ఎక్కాడు. విద్యుత్ సరఫరా కావడంతో అక్కడికక్కడే మృతిచెందినట్లు స్థానికులు పేర్కొన్నారు. బత్తలపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. కాగా.. మృతుని వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News October 22, 2025

ALL THE BEST

image

బుక్కరాయసముద్రం మండలం సిద్ధరాంపురం జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు ఎంపికైనట్లు హెచ్ఎం నీరజ తెలిపారు. చంద్రగిరిలో జరిగే అండర్-14 విభాగంలో బిందు, నందు, లక్ష్మి, కడపలో జరిగే అండర్-17 విభాగంలో జగదీశ్వరి ఎంపికయ్యారు. క్రీడాకారులను పీడీ గట్టు నాగరాజు, ఉపాధ్యాయులు నాగేంద్ర ప్రసాద్, కోటేశ్వరప్ప, బాలకృష్ణ, ఉమ, లలిత, వెంకటలక్ష్మి, మధుమాల, కమల, సువర్ణ అభినందించారు.

News October 22, 2025

సోలార్ ప్రాజెక్టు కోసం భూముల గుర్తింపు సర్వే పూర్తి చేయాలి: కలెక్టర్

image

సోలార్ ప్రాజెక్టు కోసం భూముల గుర్తింపు సర్వే పూర్తి చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఓ.ఆనంద్ ఆదేశించారు. మంగళవారం అనంతపురం కలెక్టరేట్లో సోలార్ ప్రాజెక్టు కోసం భూసేకరణపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. కంబదూరు మండలంలో ఏర్పాటు చేస్తున్న సోలార్ ప్రాజెక్టు కోసం 4,292.28 ఎకరాలు గుర్తించామని, పెండింగ్‌లో ఉన్న 984.53 ఎకరాల భూముల గుర్తింపు సర్వే పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు.

News October 21, 2025

సర్ధార్@150 యూనిటీ మార్చ్‌ను విజయవంతం చేయండి: కలెక్టర్

image

సర్ధార్ @150 యూనిటీ మార్చ్‌ను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ ఆదేశించారు. మంగళవారం అనంతపురం కలెక్టరేట్‌లో సర్ధార్ 150@ యూనిటీ మార్చ్ ఏక్ భారత్ ఆత్మనిర్భర్ భారత్ పాదయాత్ర పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదినం పురస్కరించుకొని ఈ నెల 31న నిర్వహించబోయే కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని యువతీ, యువకులకు సూచించారు.