News February 7, 2025
బత్తలపల్లి పోలీస్ స్టేషన్ను తనిఖీ చేసిన ఎస్పీ రత్న

బత్తలపల్లి పోలీస్ స్టేషన్ను శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న తనిఖీ చేసింది. శుక్రవారం ఆమె స్టేషన్లోకి రావడంతో ఎస్ఐ సోమశేఖర్, సిబ్బంది ఎస్పీకి సెల్యూట్ కొట్టి స్వాగతించారు. అనంతరం స్టేషన్లోని రికార్డులను పరిశీలించారు. నేరాల నియంత్రణలో పోలీసులు ప్రముఖ పాత్ర పోషించాలని సూచించారు. ధర్మవరం డీఎస్పీ హేమంత్ కుమార్, బత్తలపల్లి సీఐ ప్రభాకర్, ఎస్ఈబీ ఎస్ఐ ప్రదీప్ కుమార్ ఉన్నారు.
Similar News
News October 30, 2025
విద్యా విధానాల్లో నాణ్యత పెంపునకు కృషి చేయాలి: కలెక్టర్

విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని విద్యా విధానాల్లో నాణ్యత పెంపునకు విద్యాశాఖాధికారులు, ఉపాధ్యాయులు మరింత కృషి చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. కలెక్టర్ చాంబర్లో మధ్యాహ్న భోజనం, ఆధార్ నమోదు తదితర కార్యక్రమాలపై విద్యాశాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులు క్రమం తప్పక పాఠశాలలు తనిఖీ చేసి, నివేదికలు పోర్టల్లో నమోదు చేయాలన్నారు.
News October 30, 2025
చైనా అంతరిక్ష యాత్రకు పాక్ ఆస్ట్రోనాట్!

చైనా, పాకిస్థాన్ దోస్తీ కొత్త పుంతలు తొక్కుతోంది. తమ టియాంగోంగ్ స్పేస్ స్టేషన్కు చేపట్టే స్వల్పకాలిక అంతరిక్ష యాత్రలో పాకిస్థానీ ఆస్ట్రోనాట్కు అవకాశం కల్పిస్తామని చైనా ప్రకటించింది. ఎంపికైన పాక్ వ్యోమగామికి తమ ఆస్ట్రోనాట్లతో పాటు ట్రైనింగ్ ఇవ్వనున్నట్లు తెలిపింది. ట్రైనింగ్ ప్రోగ్రామ్, మిషన్ టైమ్లైన్ను ఖరారు చేసే పనిలో చైనా, పాక్ స్పేస్ ఏజెన్సీలు ఉన్నాయని అక్కడి మీడియా వెల్లడించింది.
News October 30, 2025
కోరుట్ల: వేధింపులు భరించలేక బాలిక బలవన్మరణం

కోరుట్ల మండలానికి చెందిన ఓ బాలిక (17) బుధవారం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అదే మండలానికి చెందిన నందీశ్వర్ అనే యువకుడు ప్రేమ పేరుతో వేధించడంతో మనస్తాపం చెంది బాలిక ఈ తీవ్ర నిర్ణయం తీసుకుంది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు ఎస్సై చిరంజీవి కేసు నమోదు చేశారు. నిందితుడు నందీశ్వర్ను పోలీసులు అరెస్టు చేసి, తదుపరి విచారణ నిమిత్తం రిమాండ్కు తరలించారు


