News February 7, 2025

బత్తలపల్లి పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ రత్న

image

బత్తలపల్లి పోలీస్ స్టేషన్‌ను శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న తనిఖీ చేసింది. శుక్రవారం ఆమె స్టేషన్లోకి రావడంతో ఎస్ఐ సోమశేఖర్, సిబ్బంది ఎస్పీకి సెల్యూట్ కొట్టి స్వాగతించారు. అనంతరం స్టేషన్‌లోని రికార్డులను పరిశీలించారు. నేరాల నియంత్రణలో పోలీసులు ప్రముఖ పాత్ర పోషించాలని సూచించారు. ధర్మవరం డీఎస్పీ హేమంత్ కుమార్, బత్తలపల్లి సీఐ ప్రభాకర్, ఎస్‌ఈబీ ఎస్ఐ ప్రదీప్ కుమార్ ఉన్నారు.

Similar News

News December 8, 2025

ఏజెంట్ స్పేస్‌లో డాక్యుమెంట్లు తప్పనిసరిగా అప్లోడ్ చేయాలి: కలెక్టర్

image

జిల్లాలోని అన్ని శాఖల వారు ఏజెంట్ స్పేస్‌లో డాక్యుమెంట్ అప్లోడ్ తప్పనిసరిగా చేయాలని కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు. ఇప్పటివరకు సర్వే శాఖ లక్షకు పైగా, కలెక్టరేట్ ద్వారా 55 వేలు మాత్రమే అప్లోడ్ చేశారని ఇరిగేషన్ రిజిస్ట్రేషన్ దేవాదాయ, వాణిజ్య పన్నులు, కాలుష్య నియంత్రణ, విద్యాశాఖ, టౌన్ ప్లానింగ్, మైనారిటీ సంక్షేమ శాఖ, తదితర శాఖలు ఒక డాక్యుమెంట్ కూడా అప్లోడ్ చేయలేదని, వేగవంతంగా పూర్తి చేయాలన్నారు.

News December 8, 2025

10ఏళ్లలో రూ.కోటి విలువ రూ.55లక్షలే!

image

మీరు దాచుకున్న డబ్బు విలువ కాలక్రమేణా ద్రవ్యోల్బణం కారణంగా తగ్గిపోతుందనే విషయం మీకు తెలుసా? మీ దగ్గర రూ.కోటి ఉంటే ప్రస్తుతం ఉన్న ద్రవ్యోల్బణం(6%) కొనసాగితే మరో పదేళ్లలో అది ₹55.8 లక్షలకు చేరనుంది. 2045లో రూ.31.18లక్షలు, 2075నాటికి ₹కోటి విలువ రూ.5.4లక్షలకు పడిపోనుంది. అందుకే డబ్బును పొదుపు చేయడంతో పాటు సంపద విలువను కాపాడుకోవడానికి పెట్టుబడి పెట్టడం అలవర్చుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.

News December 8, 2025

కేంద్ర ఉద్యోగులకు వేతన సవరణ ఆలస్యమేనా!

image

7వ PRC గడువు ఈ నెలాఖరుతో ముగియనుంది. 2026 JAN నుంచి 8వ PRC అమలు కావాలి. ఈ కమిషన్‌ను కేంద్రం ఈ ఏడాది JANలో వేసినా టర్మ్స్‌ను NOVలో కానీ ప్రకటించలేదు. కాగా PRCపై LSలో MPలు ప్రశ్నించగా ‘ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఎప్పటినుంచి అనేది ప్రభుత్వం నిర్ణయిస్తుంది. కమిషన్ నివేదికకు 18 నెలల సమయం పడుతుంది’ అని మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. దీంతో కేంద్ర ఉద్యోగులు ఎదురుచూస్తున్న PRC అమలు ఆలస్యం కావొచ్చంటున్నారు.