News February 10, 2025
బత్తలపల్లి విద్యార్థిని జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక

విజయవాడలో ఆదివారం రాష్ట్ర స్థాయిలో వేదిక్ మ్యాథ్స్ పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో వేదిక్ మ్యాథ్స్ లెవెల్-2 విభాగంలో బత్తలపల్లికి చెందిన విద్యార్థిని అద్విక ద్వితీయ బహుమతి గెలుచుకుంది. అనంతరం విశ్వం సీఈవో హరిచరణ్ చేతులపై ప్రశంసా పత్రం, కప్పు అందుకుంది. హైద్రాబాద్లో జరగబోయే జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక అయిందని ప్రధానోపాధ్యాయులు లక్ష్మీనారాయణ తెలిపారు.
Similar News
News November 19, 2025
HYD: ఈనెల 19న పీజీ, పీహెచ్డీ ప్రవేశాలకు కౌన్సిలింగ్

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన PG & PhD ప్రవేశాలకు 2వ విడత కౌన్సిలింగ్ ఈనెల 19న జరగనుంది. యూనివర్సిటీ ఆడిటోరియంలో మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించనున్నారు. ఆసక్తి, అర్హులైన అభ్యర్థులు హాజరు కావాలని, ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం విశ్వవిద్యాలయం వెబ్సైట్ను సంప్రదించాలన్నారు.
News November 19, 2025
టీమ్ ఇండియా ప్రాక్టీస్లో మిస్టరీ స్పిన్నర్

సౌతాఫ్రికాతో తొలి టెస్టులో స్పిన్నర్ల ధాటికి టీమ్ ఇండియా ఘోరంగా <<18303459>>ఓడిన <<>>సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రొటీస్ బౌలర్లను ఎదుర్కొనేందుకు మిస్టరీ స్పిన్నర్ను మేనేజ్మెంట్ రంగంలోకి దించింది. ప్రాక్టీస్ సెషన్లో స్పిన్నర్ కౌశిక్ మైతీతో బౌలింగ్ చేయించింది. 2 చేతులతో బౌలింగ్ చేయగలగడం కౌశిక్ ప్రత్యేకత. లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లకు కుడి చేతితో, రైట్ హ్యాండ్ బ్యాటర్లకు ఎడమ చేతితో బౌలింగ్ వేయగలరు.
News November 19, 2025
‘అరట్టై’ నుంచి బిగ్ అప్డేట్..

దేశీ మెసేజింగ్ యాప్ ‘అరట్టై’లో బిగ్ అప్డేట్ను జోహో సంస్థ తీసుకొచ్చింది. ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ను ప్రవేశపెట్టింది. ఇకపై డైరెక్ట్ చాట్లకు ఎన్క్రిప్షన్ రక్షణ ఉంటుందని జోహో తెలిపింది. కొత్త వెర్షన్ను అప్డేట్ చేసుకోవాలని యూజర్లను కోరింది. ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ వల్ల మెసేజ్ను పంపినవారు, రిసీవ్ చేసుకున్న వారే చూస్తారని చెప్పింది. గ్రూప్ చాట్స్కూ త్వరలో అందుబాటులోకి తెస్తామని పేర్కొంది.


