News July 11, 2024
బదీలీల ప్రక్రియను పారదర్శకంగా జరగాలి: కలెక్టర్

ప్రభుత్వం చేపట్టిన ఉద్యోగుల బదిలీ ప్రక్రియ ఖమ్మం జిల్లాలో పారదర్శకంగా జరగాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. కలెక్టరేట్లో ఉద్యోగుల బదిలీ ప్రక్రియపై అధికారులతో ఆయన సమీక్షించారు. ఉద్యోగ బదిలీలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ బదిలీలకు అవకాశం ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. నాలుగు సంవత్సరాలు ఓకే చోట పనిచేసిన వారిని బదీలీ చేస్తామని, జూలై 9 నుండి 12 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
Similar News
News December 27, 2025
అక్రమ రవాణాపై పోలీసుల ఉక్కుపాదం: సీపీ సునీల్ దత్

ఖమ్మం జిల్లాలో అక్రమ రవాణా, చట్టవ్యతిరేక కార్యకలాపాల కట్టడికి విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నట్లు CP సునీల్ దత్ తెలిపారు. సరిహద్దు రాష్ట్రాల నుంచి గంజాయి, ఇసుక, రేషన్ బియ్యం తరలించే ముఠాలపై ప్రత్యేక నిఘా ఉంచామన్నారు. ఇందులో భాగంగా తనిఖీలను ముమ్మరం చేసినట్లు వెల్లడించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకుంటామని, అలాగే డ్రంక్&డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన వారిపై కేసులు నమోదు చేశామన్నారు.
News December 27, 2025
ప్రయాణికులకు ఊరట.. ఖమ్మం మీదుగా 10 ప్రత్యేక రైళ్లు

సంక్రాంతి పండగ వేళ ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఖమ్మం మీదుగా మొత్తం పది ప్రత్యేక రైలు సర్వీసులను నడపనున్నట్లు స్టేషన్ చీఫ్ కమర్షియల్ ఇన్స్పెక్టర్ డి.రాజగోపాల్ వెల్లడించారు. ఇందులో ఐదు రైళ్లు ఖమ్మం మీదుగా రాకపోకలు సాగిస్తాయని పేర్కొన్నారు. జనవరి 9 నుంచి 20 వరకు ఈ ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయని ఆయన తెలిపారు.
News December 27, 2025
ఖమ్మం: ఇయర్ ఎండింగ్ ఎఫెక్ట్.. తగ్గిన రిజిస్ట్రేషన్లు

ఖమ్మం రవాణాశాఖ ఆఫీస్లో రోజుకు 50 నుంచి 60 వాహనాల రిజిస్ట్రేషన్లు జరుగుతాయి. కానీ గత ఐదు రోజులుగా ఈ రద్దీ సగానికి పైగా తగ్గింది. కొత్త సంవత్సరం, సంక్రాంతి సమయంలో వాహనాలు కొనవచ్చని చాలా మంది వేచి చూస్తుంటారు. అంతే కాకుండా వాహనాల షోరూంలు పలు ఆఫర్లు ప్రకటించి విక్రయాలు జరుపుతుంటాయి. దీంతో ఆ ప్రభావం రవాణా శాఖపై పడింది. ఎప్పుడూ రద్దీగా ఉండే ఆర్డీవో ఆఫీస్, కేఎంసీ రహదారి ప్రస్తుతం ఖాళీగా కనిపిస్తోంది.


