News May 3, 2024
బద్వేలు: ఇద్దరు పెన్షన్ దారులు మృతి

బద్వేలు పట్టణంలోని 7వ వార్డు అమ్మవారిశాల వీధిలో ఉండే రామయ్య అనే వృద్ధుడు శుక్రవారం పెన్షన్ కోసం మీ సేవ వద్దకు వెళ్లి తిరిగి ఇంటికి చేరుకున్న కాసేపటికి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అలాగే సురేంద్రనగర్ కు చెందిన నాగిపోగు ఎల్లమ్మ అనే మహిళ కూడా పెన్షన్ కోసం బ్యాంకుకు వెళ్లి వచ్చినప్పటి నుంచి తనకు అస్వస్థతగా ఉందంటూ కుటుంబ సభ్యులకు తెలిపిన కొద్దిసేపటికే మృతి చెందినట్లు వారు తెలిపారు.
Similar News
News October 22, 2025
కడప జిల్లాలో పరిస్థితిని బట్టి స్కూళ్లకు సెలవు

భారీ వర్షాల నేపథ్యంలో వాతావరణశాఖ వర్ష సూచనలు ప్రకటించిన నేపథ్యంలో ఇప్పటికే చిత్తూరు, నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాలకు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా కడప జిల్లాలో మండలాల వారీగా నేడు స్థానికంగా ఉన్న పరిస్థితులు, వర్షాలు, ఇబ్బందులు ఆధారంగా సెలవును మండల MEOలు ప్రకటించాలని జిల్లా విద్యాశాఖ అధికారి కొద్దిసేపటి క్రితమే సర్కిలర్ జారీ చేశారు.
News October 22, 2025
కడప జిల్లా కలెక్టర్కు సెలవులు మంజూరు.!

కడప జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ ఈనెల 21 నుంచి 29 వరకు సెలవుపై వెళ్లనున్నారు. కాగా జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్గా JC అతిధిసింగ్ బాధ్యతలు తీసుకోనున్నారు. అయితే జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్కు సెలవు మంజూరు చేస్తూ ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి విజయానంద్ ఆదేశాలు జారీ చేశారు. జిల్లా కలెక్టర్ శ్రీధర్ తిరిగి 29వ తేదీన విధుల్లో చేరనున్నారు.
News October 21, 2025
సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా కడప జిల్లా వాసి

తొండూరు మండలం భద్రంపల్లెకు చెందిన ఈశ్వరయ్య సీపీఐ నూతన రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికయ్యారు. గుజ్జుల ఈశ్వరయ్య ప్రాథమిక విద్య చదువుతుండగా.. విద్యార్థి ఉద్యమానికి ఆకర్షితుడై ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి గాను, రాష్ట్ర అధ్యక్షునిగా, ప్రధాన కార్యదర్శిగా, జాతీయ కార్యదర్శిగా, ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా జాతీయ ఉపాధ్యక్షునిగా సమస్యలపై, నిరుద్యోగ సమస్యపై సమస్యల పోరాటాలు నిర్వహించారు.