News November 16, 2024
బద్వేలు: రైలు నుంచి కిందపడిన విద్యార్థిని వివరాలివే.!

అన్నమయ్య జిల్లా శెట్టిగుంట సమీపంలో శుక్రవారం రైలు<<14622107>> కిందపడి విద్యార్థినికి తీవ్ర గాయాలై<<>>న విషయం తెలిసిందే. విద్యార్థిని బద్వేలు మండలం రాజుపాలెంకి చెందిన రామసుధ(20)గా రైల్వే పోలీసులు విచారణలో గుర్తించారు. ఈమె తిరుపతిలోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ 3వ సంవత్సరం చదువుతోంది. తిరుపతి నుంచి రైలులో ఇంటికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.
Similar News
News December 5, 2025
ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరలు

ప్రొద్దుటూరులో శుక్రవారం బంగారం, వెండి ధరల వివరాలు:
*బంగారం 24 క్యారెట్ 1గ్రాము రేట్: రూ.12785.00
*బంగారం 22 క్యారెట్ 1గ్రాము రేట్: రూ.11,762.00
*వెండి 10 గ్రాములు రేట్: రూ.1780.00
News December 5, 2025
కడప రిమ్స్ సేవలు నిరాశపరుస్తున్నాయి!

కడప రిమ్స్ సేవలపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ‘రిమ్స్ సేవలపై మీ అభిప్రాయమేంటి?’ అంటూ Way2Newsలో పబ్లిష్ అయిన <<18460527>>వార్తకు<<>> భారీ స్పందన లభించింది. రోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారని, రెఫరెన్స్తో సేవలు త్వరగా అందుతాయని, కొన్ని సేవలకు లంచం ఇవ్వాలని, కొందరు వైద్యులు, నర్సులు కఠినంగా మాట్లాడతారని కామెంట్ల రూపంలో ఎండగట్టారు. ఎమర్జెన్సీ, కాన్పుల వార్డులో సేవలు బాగున్నాయని కితాబిచ్చారు.
News December 5, 2025
కడప: మూడో విడత మెగా పీటీఎంలో ఏ మార్పులు కావాలి?

పాఠశాలల అభివృద్ధిలో తల్లిదండ్రుల భాగస్వామ్యం కోసం మూడోసారి మెగా పీటీఎం (పేరెంట్ – టీచర్ మీట్) శుక్రవారం జరుగనుంది. అయితే రెండు మీట్లో ఏమి తీర్మానాలు చేశారు? అవి అమలు అయ్యాయా? లేదో పరిశీలించాల్సిన అవసరం ఉంది. జిల్లా వ్యాప్తంగా 1,967 పాఠశాలల్లో 1.29 లక్షల మంది విద్యార్థుల కోసం మూడో సారి ఏమి చేస్తే బాగుంటుందో కామెంట్ చేయండి.


