News April 6, 2024

బద్వేల్‌లో అత్యధిక మెజారిటీ భార్యా భర్తలదే..

image

బద్వేల్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 18 సార్లు ఎన్నికలు జరిగాయి. 2019లో వైసీపీ తరఫున దివంగత జి.వెంకటసుబ్బయ్య 44734 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఆయన మరణాంతరం జరిగిన ఉప ఎన్నికల్లో దాసరి సుధ 90 వేల ఓట్ల పైచిలుకు మెజారిటితో గెలిచారు. ఇప్పటి వరకు ఇదే అత్యధిక మెజారిటీ. తాజాగా వైసీపీ నుంచి దాసరి సుధ, కూటమి నుంచి బొజ్జ రోషన్న బరిలో ఉన్నారు. ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో మీ అభిప్రాయం చెప్పండి.

Similar News

News November 18, 2025

గండికోటలో ప్రమాదాల అంచున సెల్ఫీ

image

గండికోట ప్రసిద్ధి చెందిన పర్యాటక కేంద్రం. యువకులు, విద్యార్థులు, పెద్దలు, కొందరు పర్యాటకులు గండికోటను దర్శిస్తుంటారు. ఇక్కడ లోయ ఉండడంతో ప్రకృతి ప్రేమికులను ఆకర్షిస్తుంటుంది. రెండు కొండల మధ్య లోయ చుపరులను ఆకట్టుకుంటూ కనువిందు చేస్తుంటుంది. ఈ దృశ్యాన్ని తిలకిస్తూ ప్రమాదపు అంచున ఫొటోలు దిగుతూ ఉంటారు. అధికారులు ప్రమాదాలు జరగకుండా ముందస్తుగా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని పలువురు పేర్కొంటున్నారు.

News November 18, 2025

గండికోటలో ప్రమాదాల అంచున సెల్ఫీ

image

గండికోట ప్రసిద్ధి చెందిన పర్యాటక కేంద్రం. యువకులు, విద్యార్థులు, పెద్దలు, కొందరు పర్యాటకులు గండికోటను దర్శిస్తుంటారు. ఇక్కడ లోయ ఉండడంతో ప్రకృతి ప్రేమికులను ఆకర్షిస్తుంటుంది. రెండు కొండల మధ్య లోయ చుపరులను ఆకట్టుకుంటూ కనువిందు చేస్తుంటుంది. ఈ దృశ్యాన్ని తిలకిస్తూ ప్రమాదపు అంచున ఫొటోలు దిగుతూ ఉంటారు. అధికారులు ప్రమాదాలు జరగకుండా ముందస్తుగా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని పలువురు పేర్కొంటున్నారు.

News November 18, 2025

జమ్మలమడుగు నియోజకవర్గ వైసీపీ ఇన్‌ఛార్జ్ సుధీర్ రెడ్డి కేనా..?

image

మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పాలిటిక్స్‌లో మళ్లీ యాక్టివ్ అయినట్లు తెలుస్తోంది. ఇన్ని రోజులు పార్టీ కార్యక్రమాలు కొన్నింట్లో పాల్గొని, మరి కొన్నింట్లో కనిపించకుండా పోయారు. దీంతో ఆయన పాలిటిక్స్‌కు దూరం అయ్యారనే గుసగుసలు వినిపించాయి. అయితే వారం రోజుల నుంచి ఆయనకు సంబంధించిన అభిమానులు, నాయకులు ‘BOSS IS BACK’ అంటూ పోస్టులు పెడుతున్నారు. ఆయనకే నియోజకవర్గ బాధ్యతలు కూడా ఇస్తారనే టాక్ నడుస్తోంది.