News December 1, 2024
బద్వేల్ మున్సిపల్ వైస్ ఛైర్మన్పై కేసు నమోదు

బద్వేల్ మున్సిపల్ వైస్ ఛైర్మన్ గోపాలస్వామిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదైంది. తమ భూములు గోపాల స్వామి అక్రమంగా రిజిస్టర్ చేసుకున్నారంటూ మేడిమాల సుశీల పోలీసులకు ఫిర్యాదు చేశారు. చెన్నంపల్లిలోని డీకేటీ భూములను ఆధార్ కార్డు ట్యాంపరింగ్తో తన పేరుపై రిజిస్టర్ చేసుకున్నడని ఫిర్యాదులో పేర్కొన్నారు. మున్సిపల్ వైస్ ఛైర్మన్ గోపాలస్వామి, సబ్ రిజిస్టర్ రామలక్షుమ్మతో పాటు మరో ముగ్గురిపై కేసు నమోదైంది.
Similar News
News February 26, 2026
కడప: ఇవాళ పరీక్షకు 466 మంది గైర్హాజర్.!

కడప జిల్లాలో గురువారం 62 సెంటర్లలో ఇంటర్ 2nd ఇయర్ ఇంగ్లిష్ పరీక్షలు జరిగాయి. నేడు 16,861 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా.. 16,395 మంది మాత్రమే రాశారు. 466 మంది గైర్హాజరయ్యారు. జనరల్ విద్యార్థుల్లో 15,792 మంది రాయాల్సి ఉండగా.. 15,300 మంది రాశారు. 402 మంది ఆబ్సెంట్ అయ్యారు. ఒకేషనల్ విద్యార్థుల్లో 1,159 మంది రాయాల్సి ఉండగా.. 1,095 మంది రాశారు. 64 మంది రాయలేదు.
News February 26, 2026
కడప: ఓ ప్రభుత్వ అధికారి ఫిర్యాదు చేసినా పట్టించుకోరా?

జౌళి శాఖ అధికారులు <<19165873>>తన సంతకాన్ని, పేరును<<>> వాడుకొని అక్రమాలు చేశారని ఇరిగేషన్ అధికారి AEE గౌతమ్ రెడ్డి కలెక్టర్కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. AEE ఫిర్యాదు చేసి 3 నెలలు గడుస్తున్నా తప్పు చేసిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదనే ఆరోపణలు వస్తున్నాయి. PGRSలో ఓ ప్రభుత్వ అధికారి చేసిన ఫిర్యాదుకే చర్యలు లేనపుడు, సామాన్య ప్రజల ఫిర్యాదులు ఎలా పరిష్కారం అవుతాయనే అనుమానాలు ప్రజల్లో వ్యక్తం అవుతున్నాయి.
News February 26, 2026
ప్రొద్దుటూరులో నేడు బంగారం, వెండి ధరల వివరాలు ఇలా.!

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో గురువారం బంగారం, వెండి ధరల వివరాలు:
*24 క్యారెట్ బంగారం 1 గ్రాము ధర రూ.15,730
*22 క్యారెట్ బంగారం 1 గ్రాము ధర రూ.14,472
*వెండి 10 గ్రాముల ధర రూ.2,720 గా ఉంది.


