News December 8, 2024
బనగానపల్లెలో టీచర్పై కేసు

ఓ ప్రైవేటు పాఠశాల టీచర్ను తల్లిదండ్రులు చితకబాది పోలీసులకు అప్పగించిన ఘటన బనగానపల్లెలో శనివారం జరిగింది. మ్యాథ్స్ టీచర్ ధృవకుమార్ విద్యార్థులకు మార్కులు ఎక్కువ వేస్తానని ఓ విద్యార్థిని వద్ద డబ్బు వసూలు చేసినట్లు యాజమాన్యం ఫిర్యాదు మేరకు కేసు నమోదైనట్లు ఎస్సై తెలిపారు. అయితే దాంతో పాటు విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించాడని తెలిసి పేరెంట్స్ చితకబాది పోలీసులకు అప్పగించినట్లు సమాచారం.
Similar News
News November 17, 2025
సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యం: మంత్రి టీజీ

పేద కుటుంబాల సొంతింటి కలను సాకారం చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి టీజీ భరత్ స్పష్టం చేశారు. కర్నూలులోని జగన్నాథగుట్ట ఎన్టీఆర్ కాలనీలో సోమవారం 187 టిడ్కో గృహాలను ఆయన లబ్ధిదారులకు పంపిణీ చేశారు. కర్నూలులో 10 వేల టిడ్కో ఇళ్ల పూర్తికి రూ.18 కోట్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు. తొలి దశలో 187 గృహాలు అందించగా, మార్చి 31 నాటికి మొత్తం ఇళ్ల పనులు పూర్తిచేస్తామని ప్రకటించారు.
News November 17, 2025
సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యం: మంత్రి టీజీ

పేద కుటుంబాల సొంతింటి కలను సాకారం చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి టీజీ భరత్ స్పష్టం చేశారు. కర్నూలులోని జగన్నాథగుట్ట ఎన్టీఆర్ కాలనీలో సోమవారం 187 టిడ్కో గృహాలను ఆయన లబ్ధిదారులకు పంపిణీ చేశారు. కర్నూలులో 10 వేల టిడ్కో ఇళ్ల పూర్తికి రూ.18 కోట్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు. తొలి దశలో 187 గృహాలు అందించగా, మార్చి 31 నాటికి మొత్తం ఇళ్ల పనులు పూర్తిచేస్తామని ప్రకటించారు.
News November 17, 2025
రీ-ఓపెన్ అర్జీదారులతో కలెక్టర్ సంభాషణ

ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) నుంచి వచ్చిన రీ-ఓపెన్ అర్జీలపై కర్నూలు కలెక్టర్ డా. ఎ. సిరి సోమవారం స్వయంగా అర్జీదారులతో ఫోన్లో మాట్లాడి సమస్యల వివరాలు తెలుసుకున్నారు. అర్జీల పరిశీలన, ఎండార్స్మెంట్ల అందజేత, భూమి సంబంధించిన అంశాలలో ఫీల్డ్ విజిట్ జరిగిందా అనే విషయాలను ఆమె అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఫిర్యాదు పరిష్కారం అయ్యే వరకు పర్యవేక్షించాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.


