News February 18, 2025
బర్డ్ఫ్లూ బఫర్ జోన్లో నిరంతర అప్రమత్తత: కలెక్టర్

గంపలగూడెం మండలంలోని కోళ్ల మరణాలకు సంబంధించి బర్డ్ఫ్లూ నిర్ధారణ కావడంతో 10 కిలోమీటర్ల పరిధిలోని 35 గ్రామాల్లో తీసుకున్న ముందస్తు జాగ్రత్త చర్యలను కొనసాగించాలని కలెక్టర్ జి.లక్ష్మీశ ఆదేశించారు. అనుమల్లంక ఘటన నేపథ్యంలో నివారణ, నియంత్రణ చర్యలపై సమీక్షించేందుకు కలెక్టర్ లక్ష్మీశ అధ్యక్షతన సోమవారం కలెక్టరేట్లో జిల్లా సమన్వయ కమిటీ సమావేశం జరిగింది.
Similar News
News March 24, 2025
నర్సంపేట: రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి

వరంగల్ జిల్లా నర్సంపేటలో సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో బీటెక్ చదువుతున్న ఒక విద్యార్థి మృతి చెందాడు. జయముఖి కాలేజీలో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్న దారం వికాస్(22), మరో విద్యార్థి రాజు బైక్పై పాకాల నుంచి నర్సంపేటకు వస్తున్నారు. రాజుపేట శివారులో ద్విచక్ర వాహనం అదుపుతప్పడంతో ఇద్దరూ కిందపడ్డారు. ఈ ఘటనలో వికాస్ అక్కడికక్కడే మృతిచెందగా.. రాజుకు తీవ్ర గాయాలు అయ్యాయి.
News March 24, 2025
రాత్రి భోజనం తర్వాత ఇలా చేయండి!

కొన్ని అలవాట్లు రాత్రి తిన్న తర్వాత జీర్ణక్రియను వేగవంతం చేయడంలో సహాయపడతాయని వైద్యులు చెబుతున్నారు. ‘తిన్న తర్వాత ఓ 10 ని.లు నడిస్తే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. గోరు వెచ్చని నీళ్లు తాగితే ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. తిన్న తర్వాత ఓ 30 ని.లు పడుకోకుండా ఉంటే ఎసిడిటీ, గ్యాస్ సమస్యలు ఉండవు. సోంపు లేదా వాము నమిలితే బాగా జీర్ణమై మలబద్ధకం తగ్గుతుంది. కొద్దిసేపు నిటారుగా కూర్చున్నా మంచిదే’ అని తెలిపారు.
News March 24, 2025
కోడుమూరు ఘటన.. వార్డెన్ సస్పెండ్

కర్నూలు జిల్లా కోడుమూరులోని ఎస్సీ హాస్టల్ వార్డెన్ జి.రాముడును సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా ఉత్తర్వులు జారీ చేశారు. బాలుర వసతి గృహంలో పదో తరగతి విద్యార్థి మహేశ్.. రాజు, జె.ఇసాక్ అనే స్టూడెంట్లపై భౌతికంగా దాడికి పాల్పడిన <<15871409>>వీడియో<<>> సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఘటనపై విచారణ అనంతరం వార్డెన్ రాముడిని సస్పెండ్ చేశారు. మరోవైపు ఈ ఘటనపై కేసు నమోదైంది.