News February 13, 2025

బర్డ్ ప్లూతో కంట్రోల్ రూం ఏర్పాటు: కలెక్టర్

image

ఉంగుటూరు(M) బాదంపూడిలో పౌల్ట్రీలో బర్డ్ ప్లూ శాంపిల్స్ పాజిటివ్ గా ల్యాబ్ నిర్ధారించిందని, 10 కిలోమీటర్ల పరిధిలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ వెట్రిసెల్వి అన్నారు. ఏవియన్ ఇన్ఫ్లుఎంజా నివారణ, నియంత్రణ కార్యాచరణ పై కలెక్టర్ పలు శాఖల వారితో సమీక్షించారు. పశుసంవర్ధక శాఖ కంట్రోల్ రూమ్ ఏర్పాటు నంబర్ 9966779943 ఏర్పాటు చేశామన్నారు. బర్డ్స్ ఎక్కడ చనిపోయినా సమాచారం ఇవ్వాలని కలెక్టర్ తెలిపారు.

Similar News

News November 19, 2025

కావలి: ప్రేమపేరుతో మోసం.. యువతి ఆత్మహత్యాయత్నం

image

ప్రేమపేరుతో యువకుడు మోసం చేయడంతో యువతి ఆత్మహత్యాయత్ననికి పాల్పడిన ఘటన కావలిలో చోటుచేసుకుంది. విష్ణాలయం వీధికి చెందిన యువకుడు ఓ యువతిని ఐదు నెలలుగా ప్రేమిస్తున్నానని నమ్మించాడు. పెళ్లి చేసుకోమంటే కులం పేరుతో దూషించి నిరాకరించాడు. దీంతో మనస్తాపానికి చెందిన యువతి ఫినాయిల్ తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News November 19, 2025

సేవలు – ధరలు – ఇతర వివరాలు

image

☞ సుప్రభాత సేవ: ఉ.3 గంటలకు ఉంటుంది. రోజుకు 250-300 టికెట్లు ఉంటాయి. ధర ₹120.
☞ తోమాల సేవ: సుప్రభాత సేవ తర్వాత ఉ.3.30కి ఉంటుంది. మంగళ, బుధ, గురు వారాల్లో 10 చొప్పున టికెట్లు మాత్రమే ఉంటాయి. ధర ఒక్కొక్కరికి ₹220.
☞ అర్చన సేవ: ఇది కూడా మంగళ, బుధ, గురు వారాల్లో 10 టికెట్లు మాత్రమే ఉంటాయి. టికెట్ ప్రైజ్ ₹220.
☞ అష్టదళ పాద పద్మారాధన: మంగళవారం మాత్రమే ఉండే ఈ సేవకు 60 టికెట్లు ఉంటాయి. ధర ₹1,250.

News November 19, 2025

అందుకే ఫైరింగ్ జరగలేదు!

image

AP: విజయవాడ, ఏలూరులో <<18319919>>మావోయిస్టులను<<>> పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. మావోలు, పోలీసులు ఎదురుపడితే పరస్పర కాల్పులు జరుగుతుంటాయి. అయితే పోలీసులు చాకచక్యంగా వ్యవహరించడంతో నిన్న అలా జరగలేదు. కొందరు సానుభూతిపరులను పంపి భవనాన్ని చుట్టుముట్టామని తెలియజేశారు. లొంగిపోవాలని సందేశం పంపారు. మావోలు దాచిన ఆయుధాలు బయటికి తీయకుండా దిగ్బంధించారని, దీంతో ప్రతిఘటించలేకపోయారని సమాచారం.