News February 12, 2025
బలహీనంగా ఉన్న పిల్లలను గుర్తించాలి: కలెక్టర్

అంగన్వాడీ పిల్లల్లో బలహీనంగా ఉన్నవారిని గుర్తించి, వారి గ్రోత్ మోనిటరింగ్ ను పర్యవేక్షించాలని, ప్రతి నెలా ప్రగతి కనబడాలని జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేశ్ కుమార్ మంగళవారం అధికారులను ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రాలు పూర్వ ప్రాధమిక విద్యకు పునాదిగా భావించి, పిల్లలను వీలైనంతవరకు కేంద్రానికి వచ్చేలా చూడాలని, వారికి ఆట పాటలతో విద్యను అందించాలని సూచించారు. టేక్ హోమ్ రేషన్ ఇచ్చేశామంటే సరిపోదని తెలిపారు.
Similar News
News October 30, 2025
ANU: దూరవిద్య పరీక్ష ఫలితాలు విడుదల

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం దూరవిద్య కేంద్రం పరిధిలో జులై, ఆగస్టు మాసాలలో జరిగిన పలు యూజీ, పీజీ కోర్సుల పరీక్ష ఫలితాలను VC గంగాధరరావు, రెక్టార్ శివరాం ప్రసాద్ గురువారం విడుదల చేశారు. బీఏ, బీకాం, బీబీఏ తృతీయ సెమిస్టర్, ఎంబీఏ మొదటి సెమిస్టర్ పరీక్ష ఫలితాలను విడుదల చేశారు. అవసరమైన విద్యార్థులు నవంబర్ 12వ తేదీలోగా రీవాల్యుయేషన్ కు దరఖాస్తులు అందించాలని సూచించారు.
News October 30, 2025
నవంబర్ 1న టూరిజం స్టార్ట్ ఈవెంట్: పీవో

సీతంపేటలోని NTR అడ్వెంచర్ పార్కులో నవంబర్ 1న టూరిజం స్టార్ట్ ఈవెంట్ నిర్వహిస్తున్నామని ఐటీడీఏ పీవో పవర్ స్వప్నిల్ జగన్నాథం గురువారం తెలిపారు. ఈ ఈవెంట్లో హార్ట్ ఎయిర్ బెలూన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందన్నారు. అదే రోజు జన జాతీయ గౌరవ దివస్ని నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అచ్చెన్నాయుడు, మంత్రి సంధ్యారాణి, జిల్లా ఎమ్మెల్యేలు పాల్గొంటారని పేర్కొన్నారు.
News October 30, 2025
అజహరుద్దీన్కు మంత్రి పదవి.. మీరేమంటారు?

TG: అజహరుద్దీన్ మంత్రి కావడానికి టైం ఫిక్స్ అయింది. కాగా మంత్రివర్గ విస్తరణ సమయాల్లో గతంలో లేనంతగా కాంగ్రెస్ తాజా నిర్ణయం కాక రేపుతోంది. దేశ ద్రోహికి మంత్రి పదవి ఎలా ఇస్తారని BJP.. ఓ సామాజికవర్గం ఓట్ల కోసం కాంగ్రెస్ దిగజారిందని BRS ధ్వజమెత్తాయి. అయితే అజహరుద్దీన్ క్రికెట్లో దేశానికి పేరు తెచ్చారని, ఆయనకు పదవి రాకుండా ప్రతిపక్షాలు కుట్రలు చేస్తున్నాయని కాంగ్రెస్ చెబుతోంది. దీనిపై మీరేమంటారు.


