News April 2, 2025
బలహీన వర్గాలను ఐక్యం చేసిన పాపన్న: మంత్రి

బడుగు, బలహీన వర్గాలను ఐక్యం చేసిన పోరాటయోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న వర్ధంతి సందర్భంగా సంగారెడ్డిలో పాపన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. మంత్రి మాట్లాడుతూ నేటి యువత విద్యార్థులు పాపన్నను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని చెప్పారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.
Similar News
News November 18, 2025
రోడ్డుపై అడ్డంగా క్యూలైన్.. రాజన్న భక్తుల పాట్లు

వేములవాడ రాజన్న దర్శనాలను భీమేశ్వరాలయంలోకి మార్చినప్పటి నుంచి భక్తులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. భీమన్న ఆలయంలోకి వెళ్లడానికి పార్వతిపురం వెనుక నుంచి కొత్త క్యూలైన్ నిర్మించారు. నటరాజ్ విగ్రహం ముందు ఈ క్యూలైన్ను రోడ్డుపై అడ్డంగా నిర్మించడంతో ఇటువైపు నుంచి అటువైపు వెళ్లడానికి రోడ్డు దాటే మార్గం లేకపోవడంతో కొంతమంది మహిళా భక్తులు సోమవారం రాత్రి క్యూలైన్లపైకి ఎక్కి మరీ దాటడాన్ని పై ఫొటోలో చూడొచ్చు.
News November 18, 2025
రోడ్డుపై అడ్డంగా క్యూలైన్.. రాజన్న భక్తుల పాట్లు

వేములవాడ రాజన్న దర్శనాలను భీమేశ్వరాలయంలోకి మార్చినప్పటి నుంచి భక్తులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. భీమన్న ఆలయంలోకి వెళ్లడానికి పార్వతిపురం వెనుక నుంచి కొత్త క్యూలైన్ నిర్మించారు. నటరాజ్ విగ్రహం ముందు ఈ క్యూలైన్ను రోడ్డుపై అడ్డంగా నిర్మించడంతో ఇటువైపు నుంచి అటువైపు వెళ్లడానికి రోడ్డు దాటే మార్గం లేకపోవడంతో కొంతమంది మహిళా భక్తులు సోమవారం రాత్రి క్యూలైన్లపైకి ఎక్కి మరీ దాటడాన్ని పై ఫొటోలో చూడొచ్చు.
News November 18, 2025
టెక్నాలజీతో ఉత్తమ ఫలితాలు.. జర్మనీ సదస్సులో జిల్లా రైతులు

టెక్నాలజీని అందిపుచ్చుకోవడం ద్వారా వ్యవసాయంలో ఉత్తమమైన ఫలితాలు సాధించవచ్చు అని మామిడిపెల్లికి చెందిన రైతులు నోముల వేణుగోపాల్ రెడ్డి, మోకిడె శ్రీనివాస్, నాగారానికి చెందిన దుంపేట నాగరాజు తమ అనుభవాలను వివరించారు. ACRAT ప్రాజెక్టులో భాగంగా జర్మనీలో ఐదు రోజుల వ్యవసాయ సదస్సులో రాష్ట్రానికి చెందిన 12 మంది సభ్యుల బృందంతో కలిసి పాల్గొన్న వీరు తమ క్షేత్రస్థాయి అనుభవాలను పంచుకున్నారు.


