News April 2, 2025
బలహీన వర్గాలను ఐక్యం చేసిన పాపన్న: మంత్రి

బడుగు, బలహీన వర్గాలను ఐక్యం చేసిన పోరాటయోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న వర్ధంతి సందర్భంగా సంగారెడ్డిలో పాపన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. మంత్రి మాట్లాడుతూ నేటి యువత విద్యార్థులు పాపన్నను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని చెప్పారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.
Similar News
News November 12, 2025
నల్గొండ: భయపడుతూ.. నేల మీదే చదువులు

మునుగోడు(M) రావిగూడెం ప్రాథమిక పాఠశాలలో కనీస వసతులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సమస్యల వలయంలో చిక్కుకున్న ఈ పాఠశాలలో తరగతులు నిర్వహించాలంటే ఆరుబయట రేకుల షెడ్డు కింద నేలపైన కూర్చోవాల్సి వస్తోంది. డెస్క్ బెంచీలు కూడా లేవు. ముఖ్యంగా, పాఠశాల ఆవరణ గుంతలమయంగా మారడంతో విద్యార్థులు ఆడుకోవడానికి వీలు లేకుండా పోయింది. సమస్యలు పరిష్కరించాలని టీచర్లు, విద్యార్థుల తల్లిదండ్రులు కోరారు.
News November 12, 2025
CCS సమావేశం ప్రారంభం.. ఏం జరగబోతోంది?

ఢిల్లీ పేలుడు ఘటన నేపథ్యంలో ప్రధాని మోదీ అధ్యక్షతన క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ (CCS) సమావేశం ప్రారంభమైంది. ఇందులో కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, సీతారామన్, జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ పాల్గొన్నారు. ఈ భేటీలో ఉగ్రవాదుల ఏరివేతపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దేశంలో మేజర్ సెక్యూరిటీ ఇష్యూ వచ్చినప్పుడు మాత్రమే CCS భేటీ అవుతుంది.
News November 12, 2025
మంత్రి గారూ.. కురవి వీరన్నను దర్శించుకునేది ఎప్పుడో..!

MHBD జిల్లాలోని కురవి శ్రీభద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయం ఉమ్మడి జిల్లాలోనే ప్రత్యేకమైనది. అయితే, జిల్లాలోనే ఉంటూ దేవాదాయశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న మంత్రి కొండా సురేఖ మాత్రం ఇప్పటి వరకు వీరన్నను దర్శించుకోలేదు. దీంతో కోరిన వరాలనిచ్చే కొంగుబంగారమైన వీరన్నకు సైతం మేడారం తరహాలోనే నిధులు మంజూరు చేసి ఆలయాన్ని అభివృద్ధి చేయాలని, వీరన్నను మంత్రి దర్శించుకోవాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.


