News February 28, 2025

బలివే గ్రామం ఉత్సవాల్లో మరణ మృదంగం

image

ముసునూరు మండలం బలివేలో మహాశివరాత్రి ఉత్సవాల్లో మరణ మృదంగం మోగుతోంది. 24 గంటల వ్యవధిలోనే ముగ్గురు మృతి చెందడంతో భక్తులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. లింగపాలెంకు చెందిన వెంకటేశ్వరరావు, అతని తమ్ముని కుమారుడు సుబ్రహ్మణ్యం మృతిచెందగా..మరుసటిరోజునే అక్కిరెడ్డిగూడేనికి చెందిన H. రాంబాబును గురువారం బలివే తమ్మిలేరు బలితీసుకుంది. దీంతో అప్రమత్తమైన పోలీసులు జల్లుల స్నానం చేయాలని సూచించారు.

Similar News

News February 28, 2025

ఆచంట: కుంకుమ భరిణిల కోసం బారులు తీరిన భక్తులు

image

శివరాత్రి ఉత్సవాల సందర్భంగా మూడవ రోజు ఆచంటలో ఏటా మహిళ భక్తులకు స్వామి అమ్మవార్ల వద్ద పూజ చేసిన కుంకుమ భరిణిలను అందించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా శుక్రవారం ఆలయం వద్ద కుంకుమ భరిణిల కోసం పెద్ద ఎత్తున చుట్టూ పక్కల గ్రామాల నుంచి మహిళలు భారీగా తరలి వచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణం మహిళలతో కిక్కిరిసింది. ఎటువంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు.

News February 28, 2025

పేద ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్: శ్రీనివాస వర్మ

image

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పేద ప్రజలకు ఆకాంక్షలకు అనుగుణంగా ఉందని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమం కోసం రూ.3.2 లక్షల కోట్ల నిధులు కేటాయించడం హర్షణీయమన్నారు. తెలుగు భాష అభివృద్ధికి రూ.10కోట్లు కేటాయించడంతో పాటు సూపర్ సిక్స్ పథకాల అమలకు నిధులు కేటాయించడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

News February 28, 2025

పశ్చిమ గోదావరి: పశు పోషకులకు గుడ్ న్యూస్

image

జిల్లాలోని పశువుల రైతులు పశు వ్యాధి నియంత్రణ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ నాగరాణి తెలిపారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్లో జాతీయ పశువ్యాధి నియంత్రణ పథకం గోడ పత్రికను ఆమె ఆవిష్కరించారు. మార్చి 1 నుంచి మార్చి 30 వరకు జాతీయ పశు వ్యాధి నియంత్రణ పథకంలో భాగంగా పశువులకు గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు, పలు వ్యాధి నిరోధక టీకాలను ఉచితంగా వేయనున్నట్లు తెలిపారు.

error: Content is protected !!