News February 4, 2025

బషీరాబాద్‌లో దారుణ హత్య

image

బషీరాబాద్ మండలంలోని నవల్గా గ్రామ శివారులో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. బండరాళ్లతో మోది మాల శ్యామప్పను చంపేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాండూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News November 17, 2025

ఒక్క ప్రాజెక్టు తెచ్చినట్టు నిరూపించినా రాజీనామా చేస్తా: గంటా

image

వైసీపీ హయాంలో మొదలు పెట్టి, పూర్తి చేసి ప్రారంభించిన ఒక్క ప్రాజెక్టు చూపించినా తన పదవికి రాజీనామా చేస్తానని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సవాల్ చేశారు. ఎంవీపీ కాలనీ క్యాంపు కార్యాలయంలో సోమవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తన అయిదేళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కియా వంటి చెప్పుకోదగ్గ ఒక్క కంపెనీని కూడా రాష్ట్రానికి తీసుకురాలేకపోయిందని మండిపడ్డారు.

News November 17, 2025

ఒక్క ప్రాజెక్టు తెచ్చినట్టు నిరూపించినా రాజీనామా చేస్తా: గంటా

image

వైసీపీ హయాంలో మొదలు పెట్టి, పూర్తి చేసి ప్రారంభించిన ఒక్క ప్రాజెక్టు చూపించినా తన పదవికి రాజీనామా చేస్తానని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సవాల్ చేశారు. ఎంవీపీ కాలనీ క్యాంపు కార్యాలయంలో సోమవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తన అయిదేళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కియా వంటి చెప్పుకోదగ్గ ఒక్క కంపెనీని కూడా రాష్ట్రానికి తీసుకురాలేకపోయిందని మండిపడ్డారు.

News November 17, 2025

మలికిపురం: ఇద్దరు పిల్లలతో సహా వ్యక్తి అదృశ్యం

image

మలికిపురం మండలం లక్కవరానికి చెందిన సిరిగినీడి దుర్గాప్రసాద్ ఇద్దరు పిల్లలతో సహా సోమవారం అదృశ్యమయ్యాడు. ఇద్దరు పిల్లలను ఆధార్ కార్డుల కోసం మధ్యాహ్నం ఇంటి నుంచి తీసుకువచ్చాడని కుటుంబ సభ్యులు తెలిపారు. దిండి చించినాడ వారధిపై బైకు, జోళ్లు విడిచి పిల్లలతో సహా అదృశ్యమయ్యాడు. పిల్లలతో సహా నదిలో దూకాడా లేక ఎక్కడికైనా పిల్లల్ని తీసుకొని వెళ్లాడా అన్నది మిస్టరీగా మారింది. వీరి కోసం పోలీసులు గాలిస్తున్నారు.