News February 4, 2025

బషీరాబాద్‌లో దారుణ హత్య

image

బషీరాబాద్ మండలంలోని నవల్గా గ్రామ శివారులో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. బండరాళ్లతో మోది మాల శ్యామప్పను చంపేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాండూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News October 19, 2025

మంచిర్యాల: లక్కీ డ్రా పద్ధతిన విద్యార్థుల ఎంపిక

image

జిల్లాలోని గురుకుల పాఠశాలలో ఖాళీగా ఉన్న సీట్లను జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు లక్కీ డ్రా పద్ధతిన ఎంపిక చేసి భర్తీ చేయడం జరిగిందని జిల్లా సంక్షేమ శాఖ అధికారి రాఫ్ ఖాన్ తెలిపారు. జిల్లాలోని గురుకుల బాలికల పాఠశాలలో 5వ తరగతి నుంచి 9వ తరగతి వరకు 74 సీట్లు ఖాళీగా ఉండగా 37సీట్లను భర్తీ చేయడం జరిగిందని, బాలుర పాఠశాలలో 89సీట్లకు 38సీట్లను భర్తీ చేయడం జరిగిందన్నారు.

News October 19, 2025

ప్రభుత్వ ఉద్యోగులను చంద్రబాబు దగా చేశారు: వైసీపీ నేతలు

image

AP: ప్రభుత్వ <<18045253>>ఉద్యోగులను<<>> చంద్రబాబు మరోసారి దగా చేశారని వైసీపీ మాజీ మంత్రులు కాకాణి గోవర్ధన్, మేరుగు నాగార్జున ధ్వజమెత్తారు. 4 డీఏలు పెండింగ్‌లో ఉంటే ఒకటే చెల్లిస్తామని ప్రకటించారని మండిపడ్డారు. ఎన్నికలకు ముందు ఉద్యోగులకు అనేక హామీలు ఇచ్చి, ఇప్పుడు వారిని మోసం చేస్తున్నారని విమర్శించారు. తమపై విమర్శలు తప్ప, కూటమి ప్రభుత్వం సామాన్యులు, ప్రభుత్వ ఉద్యోగులకు ఏమి చేయట్లేదన్నారు.

News October 19, 2025

సదాశివనగర్: రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

image

సదాశివనగర్ మండలం బొంపల్లి శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందినట్లు ఎస్సై పుష్పరాజ్ తెలిపారు. పోలీసులు వివరాల ప్రకారం.. గాంధారి మండలానికి చెందిన అరవింద స్వామి ద్విచక్ర వాహనంపై సదాశివనగర్ వైపు వెళ్తుండగా ఎదురుగా వస్తున్న వాహనం ఢీ కొట్టింది. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.