News February 25, 2025
బషీరాబాద్: తల్లి, కొడుకు ఆత్మహత్య

బషీరాబాద్ మండలం ఖాసీంపూర్ గ్రామంలో విషాదం నెలకొంది. ఆ గ్రామానికి చెందిన తల్లి ఎల్లమ్మ (58), కొడుకు మొగులప్ప 36) ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News March 27, 2025
జగిత్యాల: రాష్ట్రంలోనే టాప్ రాఘవపేట

జగిత్యాల జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. ఈరోజు మధ్యాహ్నం 2 గంటల సమయంలో మల్లాపూర్ మండలంలోని రాఘవపేటలో 41 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయింది. దీంతో రాఘవపేట రాష్ట్రంలోనే తొలి స్థానంలో నిలిచింది. అటు మిగతా ప్రాంతాల్లోనూ ఎండ తీవ్రత ఎక్కువగానే ఉంది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రజలు మధ్యాహ్నం సమయంలో బయటకు వెళ్లాలంటేనే జరుగుతున్నారు.
News March 27, 2025
సిద్దిపేట: అనుమతి లేకుండా ర్యాలీలు, ధర్నాలు వద్దు: CP

జిల్లాలో అనుమతి లేకుండా ర్యాలీలు, ధర్నాలు చేపట్టవద్దని సిద్దిపేట సీపీ డాక్టర్ బి.అనురాధ సూచించారు. సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ నెల 29 నుంచి వచ్చే నెల 13 వరకు సిటీ పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని తెలిపారు. అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, ర్యాలీలు, బహిరంగ సభలు, ధర్నాలు చేపట్టవద్దన్నారు. ఇలాంటి కార్యక్రమాలకు ముందస్తు అనుమతి తప్పనిసరి అన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
News March 27, 2025
జగిత్యాల: కులం పేరు మార్చాలని బీసీ కమిషన్కు వినతి

జగిత్యాలలో గురువారం పర్యటించిన బీసీ కమిషన్ చైర్మన్, సభ్యులకు పలువురు తమ కులం పేరు మార్చాలని విజ్ఞప్తి చేశారు. వీరముష్టి అంటే పూర్వకాలంలో యుద్ధ వీరులుగా ఉండే వారని, కాలక్రమేణా ముష్టి అనే పదం బిచ్చగాడు అనే పదానికి పర్యాయపదంగా మారిందని, వీరముష్టి ప్రతినిధులు తమ కులాన్ని వీరభద్ర కులంగా మార్చాలన్నారు. అలాగే తమ కులం పేరును గడ వంశీయులుగా మార్చాలని దొమ్మరి కుల సంఘం ప్రతినిధులు కమిషన్కు విజ్ఞప్తి చేశారు.