News August 8, 2024
బస్సు డ్రైవర్గా మారిన ఎమ్మెల్సీ

కుప్పం-తిరుపతి బస్సు సర్వీసును ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ప్రారంభించారు. ఆయన రిబ్బన్ కట్ చేసి, పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన బస్సును నడిపారు. ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయాణికుల సౌకర్యార్థం నూతన బస్సులను ప్రారంభించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ డీఎం పెంచులయ్య, సీఎంఏ నరసింహులు, కౌన్సిలర్లు జిమ్ దాము, జాకీర్ తదితరులు పాల్గొన్నారు.
Similar News
News December 22, 2025
చిత్తూరు జిల్లాలో 88.36% పల్స్ పోలియో

చిత్తూరు జిల్లాలో ఆదివారం 88.36% చిన్నారులకు పల్స్ పోలియో వేసినట్లు DIO హనుమంతురావు తెలిపారు. జిల్లాలో ఐదేళ్ల లోపు 2,21,502 మంది చిన్నారులు ఉన్నట్లు గుర్తించి 142 రూట్లలో 212 వాహనాల ద్వారా పోలియో చుక్కలను పంపిణీ చేశారు. 1415 బూత్ల పరిధిలో 5,800 మంది సిబ్బందితో ఆదివారం 2,94,600 వ్యాక్సిన్ కిట్లు వినియోగించారు. జిల్లాలో ఆదివారం 1,84,648 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు.
News December 21, 2025
చిత్తూరు: రేపు ఉదయం 9 నుంచి ప్రారంభం.!

చిత్తూరు కలెక్టరేట్లో సోమవారం జరగనున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సుమిత్ కుమార్ కోరారు. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు కార్యక్రమం జరగనుందని, జిల్లా అధికారులు అందుబాటులో ఉంటారని తెలిపారు. ప్రజలు తమ సమస్యలపై అర్జీలు అందిస్తే పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. అర్జీ నమోదు, స్థితిపై 1100కి కాల్ చేయవచ్చన్నారు.
News December 21, 2025
జగన్కు జన్మదిన శుభాకాంక్షలు చెప్పిన పెద్దిరెడ్డి

YCP అధినేత జగన్ను ఆదివారం ఆ పార్టీ నేత పెద్దిరెడ్డి బెంగళూరులో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జగన్కు బొకే అందజేసి, జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. నియోజకవర్గంలో నిర్వహిస్తున్న రచ్చబండ కార్యక్రమం పెద్దిరెడ్డి గురించి వివరించారు.


