News September 17, 2024
బస్ భవన్లో ప్రజా పాలన దినోత్సవ వేడుకలు

హైదరాబాద్ బస్ భవన్లో మంగళవారం ‘తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం’ ఘనంగా జరిగింది. TGSRTC ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(ఆపరేషన్స్) మునిశేఖర్ జాతీయ పతాకాన్ని ఎగురవేసి జెండా వందనం చేశారు. ఈ కార్యక్రమంలో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ రవిందర్, జాయింట్ డైరెక్టర్ అపూర్వరావు, ఫైనాన్స్ అడ్వజర్ విజయపుష్ఫ, హెచ్వోడీలు, తదితరులు పాల్గొన్నారు.
Similar News
News November 17, 2025
హైదరాబాద్ బస్తీలకు కదిలే అంగన్వాడీలు!

కదిలే గ్రంథాలయం, మూవింగ్ ఫుడ్ కోర్ట్ విన్నాం కానీ.. కదిలే అంగన్ వాడీ కేంద్రం విన్నారా..? లేదు కదా..! త్వరలో చూస్తారు కూడా. నగరంలోని పలు బస్తీలు, కాలనీల్లో మూవింగ్ అంగన్వాడీ కేంద్రాల ద్వారా సేవలందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు 37 అధునాతన వాహనాలను కూడా సిద్ధం చేసిందని సమాచారం. అంగన్వాడీ కేంద్రాలు అందుబాటులో లేని ప్రాంతాల్లో పౌష్టికాహారం అందించడంతో పాటు ఆరోగ్య సలహాలు ఇస్తారు.
News November 17, 2025
హైదరాబాద్ బస్తీలకు కదిలే అంగన్వాడీలు!

కదిలే గ్రంథాలయం, మూవింగ్ ఫుడ్ కోర్ట్ విన్నాం కానీ.. కదిలే అంగన్ వాడీ కేంద్రం విన్నారా..? లేదు కదా..! త్వరలో చూస్తారు కూడా. నగరంలోని పలు బస్తీలు, కాలనీల్లో మూవింగ్ అంగన్వాడీ కేంద్రాల ద్వారా సేవలందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు 37 అధునాతన వాహనాలను కూడా సిద్ధం చేసిందని సమాచారం. అంగన్వాడీ కేంద్రాలు అందుబాటులో లేని ప్రాంతాల్లో పౌష్టికాహారం అందించడంతో పాటు ఆరోగ్య సలహాలు ఇస్తారు.
News November 17, 2025
గ్రేటర్ చెరువులకు హైడ్రా అండ.. త్వరలో బాధ్యతలు ?

మహానగరంలో పలు చెరువులు కబ్జా కావడంతో వాటిని పరిరక్షించేందుకు హైడ్రా నడుంబిగించింది. ఈ క్రమంలో చెరువుల బాధ్యతను మొత్తం హైడ్రాకు అప్పగించాలని జీహెచ్ఎంసీ భావిస్తున్నట్లు సమాచారం. చెరువులను కాపాడటంతో పాటు అభివృద్ధి కూడా హైడ్రా చేతుల్లో పెట్టాలని ఆలోచిస్తున్నట్లు తెలిసింది. GHMCలో చెరువుల పరిరక్షణకు సిబ్బంది సమస్య ఉండటంతో ఈ ఆలోచన చేస్తున్నారు. త్వరలో ఇద్దరు కమిషనర్లు సమావేశం కానున్నట్లు తెలిసింది.


