News September 17, 2024

బస్‌ భవన్‌లో ప్ర‌జా పాల‌న దినోత్స‌వ వేడుకలు

image

హైదరాబాద్ బస్‌ భవన్‌లో మంగ‌ళ‌వారం ‘తెలంగాణ ప్ర‌జా పాల‌న దినోత్స‌వం’ ఘ‌నంగా జ‌రిగింది. TGSRTC ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్(ఆప‌రేష‌న్స్) మునిశేఖ‌ర్ జాతీయ ప‌తాకాన్ని ఎగుర‌వేసి జెండా వంద‌నం చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో చీఫ్ ఆప‌రేటింగ్ ఆఫీస‌ర్ డాక్ట‌ర్ ర‌వింద‌ర్, జాయింట్ డైరెక్ట‌ర్ అపూర్వ‌రావు, ఫైనాన్స్ అడ్వ‌జ‌ర్ విజ‌య‌పుష్ఫ‌, హెచ్‌వోడీలు, త‌దిత‌రులు పాల్గొన్నారు.

Similar News

News December 4, 2025

గ్లోబల్ సమ్మిట్‌కు HYD వ్యాప్తంగా ఫ్రీ బస్సులు

image

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఎగ్జిబిషన్‌కు ఉచిత బస్సులను ఏర్పాటు చేశారు. ఈ నెల 10 నుంచి 13 వరకు గ్లోబల్ సమ్మిట్‌కు చేరుకునేందుకు MGBS, JBS, కూకట్‌పల్లి, చార్మినార్, ఎల్బీనగర్ వంటి ప్రధాన కేంద్రాల నుంచి బస్సులు అందుబాటులో ఉండనున్నాయి. గ్లోబల్ సమ్మిట్‌కు వెళ్లేందుకు ఉ.9 నుంచి మ.1 వరకు, తిరిగి వచ్చేందుకు సా.4 నుంచి రాత్రి 9 వరకు ఇవి అందుబాటులో ఉండనున్నాయి.

News December 4, 2025

HYD: ఫ్యూచర్ సిటీకి సల్మాన్‌ఖాన్!

image

డిసెంబర్ 8, 9 తేదీల్లో ఫ్యూచర్ సిటీలో జరిగే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు ప్రముఖ బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌ను ఆహ్వానించారు. ఈ సమ్మిట్‌లో మీడియా, వినోద రంగాల్లోని పెట్టుబడిదారులతో జరిగే సమావేశంలో సల్మాన్‌ఖాన్ ప్రసంగించే అవకాశం ఉంది. ఇటీవల ముంబై పర్యటన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి సల్మాన్‌ఖాన్‌ను కలిసిన విషయం తెలిసిందే.

News December 4, 2025

రంగారెడ్డి కలెక్టరేట్‌లో ఏసీబీ దాడులు

image

రంగారెడ్డి కలెక్టరేట్ అసిస్టెంట్ డైరెక్టర్ సర్వే, ల్యాండ్స్ రికార్డు ఆఫీసులో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఏడీ సర్వేయర్ శ్రీనివాస్‌‌కు చెందిన గచ్చిబౌలిలోని మైత్రి హోమ్స్‌లోని ఇంట్లో తనిఖీలు చేస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయనే ఆరోపణలతో 3 బృందాలుగా హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. రంగారెడ్డి జిల్లాలో 6 చోట్ల సోదాలు జరుగుతున్నాయి.