News August 18, 2024

బహ్రెయిన్‌లో కోనసీమ యువకుడి ఆత్మహత్య

image

అంబేడ్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం పెదపట్నం లంకకు చెందిన నాగులపల్లి వీర వెంకట దుర్గానాగసాయి(22) బహ్రెయిన్‌లో శనివారం ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబీకులకు సమాచారం అందింది. మృతుడి మేనమామ ఉండపల్లి రమేశ్ ఆదివారం ఈ విషయం తెలిపారు. గత నెల 29న పెట్రోల్ బంక్‌లో పని చేసేందుకు నాగ సాయి వెళ్లాడన్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియవని, విచారణ జరిపించాలని, మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావాలని కోరారు.

Similar News

News November 27, 2025

రాజమండ్రి: 29న మెగా జాబ్ మేళా

image

రాజమండ్రి కలెక్టరేట్ పరిసరాల్లోని ‘వికాస’ కార్యాలయం సమీపంలో నవంబర్ 29వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. ఈ ఉద్యోగాలకు ఎస్సెస్సీ, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, బీటెక్, ఎంబీఏ ఉత్తీర్ణులైన, 35 ఏళ్ల లోపు వయసున్న అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తిగల యువత తమ సర్టిఫికెట్లతో హాజరు కావాలని సూచించారు. మరిన్ని వివరాలకు 7660823903 నంబరును సంప్రదించాలని కోరారు.

News November 27, 2025

జిల్లాలో 1.61 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ పూర్తి: జేసీ

image

ఖరీఫ్ సీజన్‌లో జిల్లాలో 4 లక్షల మెట్రిక్ టన్నుల వరి సేకరణ అంచనాగా నిర్ణయించినట్లు జాయింట్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్ వెల్లడించారు. గురువారం నాటికి మొత్తం 34,737 కొనుగోలు కూపన్లు రైతులకు జారీ చేశామని తెలిపారు. జిల్లాలోని 18 మండలాల్లో ఏర్పాటు చేసిన 201 కొనుగోలు కేంద్రాల ద్వారా, ఇప్పటివరకు 21,794 మంది రైతుల నుంచి 1,61,611.920 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు పూర్తి చేసినట్లు ఆయన పేర్కొన్నారు.

News November 27, 2025

తూ.గో రైతులకు ముఖ్య గమనిక

image

ఖరీఫ్ ధాన్యం సేకరణకు సంబంధించి ఫిర్యాదులు, సందేహాల పరిష్కారం కోసం స్థానిక బొమ్మూరు కలెక్టరేట్‌లో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు జాయింట్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కంట్రోల్ రూమ్ ప్రతిరోజూ ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పనిచేస్తుందని వెల్లడించారు. రైతులు ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ఏ సమస్య ఉన్నా 8309487151 నంబర్‌కు సంప్రదించి సహాయం పొందవచ్చని సూచించారు.