News April 8, 2025

బాంబులు అమర్చాం.. అక్కడికి వెళ్లొద్దు: ‘మావో’ లేఖ

image

ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని కర్రెగుట్టపైకి స్థానిక ప్రజలు వెళ్లవద్దని సీపీఐ మావోయిస్టు వెంకటాపురం-వాజేడు కార్యదర్శి శాంత పేరుతో లేఖను విడుదల చేశారు. ఆపరేషన్ కగార్ దాడి నుంచి రక్షణ పొందడానికి తాము కర్రెగుట్టపై బాంబులు అమర్చినట్లు తెలిపారు. ఆదివాసీ, ఆదివాసీయేతర ప్రజలు పోలీసుల మాయమాటలు నమ్మి వేట పేరుతో కర్రెగుట్టలపైకి వెళ్లొద్దని లేఖలో పేర్కొన్నారు.

Similar News

News November 10, 2025

చీపుర పుల్లల కోసం వెళ్లి.. మృతి

image

బల్లికురవ మండలం సురేపల్లిలోని కొండ మీదకు రామాంజనేయులు(65) ఆదివారం చీపుర పుల్లల కోసం వెళ్లి అపస్మారక స్థితిలో పడిపోయాడు. గమనించిన గొర్రెల కాపరులు, స్థానికులు 108కు సమాచారం అందించారు. కొండ మీద నుంచి అతనిని కిందకు తీసుకొస్తుండగా మృతి చెందినట్లు తెలిపారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

News November 10, 2025

మెడికల్ కాలేజీల్లో ఫీజులు పెంచిన ప్రభుత్వం

image

AP: రాష్ట్రంలోని ప్రైవేట్ మెడికల్, డెంటల్ కాలేజీల్లో పీజీ, యూజీ కోర్సుల ఫీజులను ప్రభుత్వం పెంచింది. 2020-23 బ్లాక్ పీరియడ్‌లో ఉన్న ఫీజుపై యూజీ కోర్సులకు 10%, సూపర్ స్పెషాలిటీ, పీజీ కోర్సులకు 15% పెంపునకు ఆమోదం తెలిపింది. హైకోర్టు, సుప్రీంకోర్టు తుదితీర్పులకు లోబడి ఇది ఉంటుందని వెల్లడించింది. రాష్ట్రంలోని ప్రైవేట్ కాలేజీల్లో సూపర్ స్పెషాలిటీ కోర్సులకు రూ.17.25 లక్షలుగా ఫీజును నిర్ధారించింది.

News November 10, 2025

ఉమ్మడి నిజామాబాద్ ప్రజలకు అలర్ట్

image

రాష్ట్రంలో రోజురోజుకు చలి తీవ్రత పెరుగుతోంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు మరింత పడిపోతున్నాయి. ఈ నెల 11 నుంచి 19 వరకు ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిడ్‌కు పడిపోయే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. అటు పొగమంచు ప్రభావం ఉంటుందని, వాహనదారులు నిదానంగా వెళ్లాలని సూచించారు. వృద్ధులు, చిన్నారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.