News February 12, 2025
బాదేపల్లి మార్కెట్లో నేటి ధరలు

జడ్చర్లలోని బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో నేడు 3137 క్వింటాళ్లు వేరుశనగ అమ్మకానికి వచ్చింది. క్వింటాలుకు గరిష్ఠం ధర రూ.6881, కనిష్ఠ ధర రూ.4050 లభించింది. కందులు 130 క్వింటాలు అమ్మకానికి రాగా గరిష్ఠంగా ధర రూ.6926, కనిష్ఠం ధర రూ.5200 లభించింది. పత్తికి క్వింటాలుకు గరిష్ఠంగా ధర రూ.6709 లభించింది. మొక్కజొన్న క్వింటాలుకు గరిష్ఠంగా ధర రూ.2411 లభించింది.
Similar News
News November 20, 2025
MBNR: బీఈడీ ఫలితాలు వెంటనే విడుదల చేయాలి

పాలమూరు విశ్వవిద్యాలయంకు అనుబంధంగా ఉన్న బీఎడ్ కళాశాలల నాలుగో సెమిస్టర్ ఫలితాలను వెంటనే విడుదల చేయాలని బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు తాయప్ప డిమాండ్ చేశారు. గురువారం పీయూ పరీక్షల నియంత్రణ అధికారిని ప్రవీణకు వినతిపత్రం అందజేశారు. ఫలితాలు విడుదల కాకపోవడంతో ఎంఈడీ కోర్సులు చేయడానికి అవకాశం లేకుండా పోయిందని, వెంటనే విడుదల చేయాలని కోరారు. ఫలితాలు విడుదల చేసేందుకు తగు చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు.
News November 19, 2025
MBNR: U-19 క్రికెట్.. రిపోర్ట్ చేయండి

ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్(SGF) ఆధ్వర్యంలో అండర్-19 బాల బాలికలకు క్రికెట్ జట్ల ఎంపికలను జడ్చర్లలోని మినీ స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు కార్యదర్శి డాక్టర్ ఆర్.శారదాబాయి ‘Way2News’తో తెలిపారు. క్రీడాకారులు ఈ నెల 20న ఒరిజినల్ బోనఫైడ్, ఆధార్, వైట్ డ్రెస్ కోడ్, పూర్తి కిట్టుతో హాజరు కావాలన్నారు. క్రీడాకారులు మహబూబ్ నగర్ పీడీ మోసీన్కు ఉదయం 9 గంటల లోపు రిపోర్ట్ చేయాలన్నారు.
News November 19, 2025
ధర్మాపూర్ వైన్స్ షాపునకు నేడు రీ-లక్కీ డిప్

ధర్మాపూర్లోని 16వ నంబర్ వైన్స్ షాప్ లైసెన్సును ప్రభుత్వ ఉద్యోగి అయిన ఒక పీఈటీ లక్కీ డిప్లో దక్కించుకున్నారు. ఈ విషయంపై ఆమెను సస్పెండ్ చేయగా, ఆమె లైసెన్సును రద్దు చేయాలని ఎక్సైజ్ కమిషనర్కు లేఖ ఇచ్చారు. దీంతో ఆ టెండర్ను రద్దు చేశారు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం 11 గంటలకు మిగిలిన పోటీదారులతో రీ-టెండర్ నిర్వహించనున్నారు.


