News February 11, 2025
బాదేపల్లి వ్యవసాయ మార్కెట్లో నేటి ధరలు

బాదేపల్లి మార్కెట్లో ఇవాళ 296 మంది రైతులు తమ పంట ఉత్పత్తులను అమ్మడానికి తీసుకువచ్చారు. వేరుశనగ 3,770 క్వింటాళ్లు అమ్మడానికి రాగా గరిష్ఠ ధర క్వింటాలుకు రూ. 6,809 లభించగా కనిష్ఠ ధర రూ. 4,265 లభించింది. కందులు 113 క్వింటాళ్లు అమ్మకానికి రాగా క్వింటాలుకు గరిష్ఠ ధర రూ.7,000, కనిష్ఠ ధర రూ. 4,002 లభించింది. మొక్కజొన్న 142 క్వింటాళ్లు అమ్మకానికి రాగా గరిష్ఠ ధర రూ. 2,361 కనిష్ఠ ధర రూ. 2,075 లభించింది.
Similar News
News September 18, 2025
మహబూబ్ నగర్ జిల్లా వర్షపాతం వివరాలు

మహబూబ్నగర్ జిల్లాలో గడచిన 24 గంటల్లో వివిధ ప్రాంతాలలో వర్షం కురిసింది. అత్యధికంగా బాలానగర్ మండలంలోని ఉడిత్యాలలో 7.0 వర్షపాతం రికార్డు అయింది. అడ్డాకుల 3.5 మిల్లీమీటర్లు, నవాబుపేట మండలం కొల్లూరు 2.5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో వర్షం కురిసి మరికొన్ని ప్రాంతాలలో క్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి.
News September 18, 2025
WOW వన్డే లీగ్.. బౌలింగ్లో సత్తా చాటిన గద్వాల కుర్రాడు

HYDలోని KCR-2 మైదానంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వన్డే క్రికెట్ లీగ్ టోర్నీలో గద్వాల్ జట్టు కుర్రాడు వెంకట్ సాగర్ బౌలింగ్ లో సత్తా చాటాడు. మొదట బ్యాటింగ్ చేసిన గద్వాల్ జట్టు 44.4 ఓవర్లలో 332/10 పరుగులు చేయగా.. HYD జట్టు కేవలం 20.3 ఓవర్లలో 56 పరుగులకే ఆలౌట్ అయింది. 9 వికెట్లు తీసిన గద్వాల్ జట్టు క్రీడాకారుడు వెంకట్ సాగర్కు కోచ్ శ్రీనివాస్ తదితరులు అభినందించారు.
News September 18, 2025
MBNR: సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ జానకి

అధికారుల పేరుతో నగదు కోరే మెసేజీల పట్ల ప్రజలు మోసపోవద్దని మహబూబ్నగర్ జిల్లా ఎస్పీ జానకి అన్నారు. ఇటీవల జిల్లాలో పలువురు సైబర్ నేరగాళ్ల పన్నాగాలకు గురవుతున్నారని, అధికారులు వ్యక్తిగత ఖాతాలకు డబ్బు పంపమని అడగరని ఆమె తెలిపారు. ఇటువంటి మెసేజీల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, సైబర్ మోసాలపై అవగాహన పెంచుకోవాలని ఆమె సూచించారు.