News April 3, 2025
బాధితులకు అండగా భరోసా: MHBD ఎస్పీ

మహబూబాబాద్ జిల్లాలో బాధితులకు భరోసా సెంటర్ నిలుస్తోందని ఎస్పీ సుధీర్ రామ్నాథ్ అన్నారు. భరోసా సెంటర్ నుంచి 8 మంది బాధితులకు అందాల్సిన రూ.65 వేల చెక్కులు, ఒకరికి కుట్టు మిషన్ను ఆయన గురువారం అందజేశారు. ఆయనతో పాటు డీఎస్పీ తిరుపతిరావు, ఎస్ఐ దీపికా రెడ్డి, భరోసా ఎస్ఐ ఝాన్సీ, తదితరులు ఉన్నారు.
Similar News
News November 28, 2025
జనగామ: గెలుపు గుర్రాలకే సర్పంచ్ టికెట్!

గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల సందడి మొదలైంది. ఆయా పార్టీల్లో సీనియర్ నాయకులు సర్పంచ్ టికెట్ కోసం ఆశిస్తున్నారు. కానీ, మండల, జిల్లా నాయకులు, పార్టీ అధిష్ఠానం మాత్రం సీనియర్, జూనియర్ అనే తేడా లేకుండా గెలుపు గుర్రాలకే టికెట్ ఇచ్చే యోచనలో ఉన్న వాతావరణం కనిపిస్తోంది. పార్టీలో మొదటి నుంచి కష్టపడ్డ వాళ్లకు టికెట్ ఇవ్వాలని కొందరు అంటుంటే, గెలిచి గ్రామాలను అభివృద్ధి చేసే వారికి ఇవ్వాలని మరికొందరు అంటున్నారు.
News November 28, 2025
NIEPVDలో ఉద్యోగాలు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

డెహ్రాడూన్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ విజ్యువల్ డిజబిలిటిస్ (<
News November 28, 2025
NZB: GPఎన్నికలు.. సిబ్బందికి సీపీ సూచనలు

గ్రామపంచాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా ప్రమాణాలకు అనుగుణంగా నిర్వహించేందుకు పోలీసు సిబ్బందికి నిజామాబాద్ పోలీస్ కమీషనర్ సాయి చైతన్య సెట్ కాన్ఫరెన్స్ ద్వారా పలు సూచనలు చేశారు. ఎన్నికల భద్రత, శాంతి భద్రతా చర్యలు, పర్యవేక్షణకు సంబంధించిన సలహాలు ఇచ్చారు. ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగేలా చూడడం ప్రజల భద్రత అని శాంతి భద్రతల పరిరక్షణ పోలీస్ బాధ్యత అని పేర్కొన్నారు.


