News April 3, 2025
బాధితులకు అండగా భరోసా: MHBD ఎస్పీ

మహబూబాబాద్ జిల్లాలో బాధితులకు భరోసా సెంటర్ నిలుస్తోందని ఎస్పీ సుధీర్ రామ్నాథ్ అన్నారు. భరోసా సెంటర్ నుంచి 8 మంది బాధితులకు అందాల్సిన రూ.65 వేల చెక్కులు, ఒకరికి కుట్టు మిషన్ను ఆయన గురువారం అందజేశారు. ఆయనతో పాటు డీఎస్పీ తిరుపతిరావు, ఎస్ఐ దీపికా రెడ్డి, భరోసా ఎస్ఐ ఝాన్సీ, తదితరులు ఉన్నారు.
Similar News
News October 19, 2025
నంద్యాల సమీపంలో రోడ్డు ప్రమాదం.. ఒకరి దుర్మరణం

నంద్యాల సమీపంలోని చిన్నచెరువు వద్ద ఎదురెదురుగా వస్తున్న రెండు బైకులు ఆదివారం రాత్రి ఢీకొన్న ఘటనలో ఒకరు మృతిచెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడినట్లు స్థానికులు తెలిపారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెప్పారు. మహానంది మండలం బొల్లవరం గ్రామానికి చెందిన హుసేన్ బాష మృతిచెందగా, బుక్కాపురం గ్రామానికి చెందిన మల్లేశ్, సువర్ణమ్మ తీవ్రంగా గాయపడ్డారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News October 19, 2025
NGKL: ఆ సమయంలో జాగ్రత్తలు తప్పనిసరి: ఎస్పీ

దీపావళి పండుగ జిల్లా ప్రజల జీవితాల్లో కోటి కాంతులు నింపాలని ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ శుభాకాంక్షలు తెలిపారు. నరకాసురుడిని శ్రీకృష్ణుడు, సత్యభామ వధించిన రోజు దీపావళి అన్నారు. ఈ పండుగ ప్రజల జీవితాల్లో వెలుగులు తీసుకురావాలని కోరారు. బాణసంచా కాల్చే సమయంలో తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని ఆయన సూచించారు.
News October 19, 2025
జనగామ: కమాండ్ కంట్రోల్ యూనిట్ పర్యవేక్షణలో బోధన

ఇంటర్ విద్యను మరింత బలోపేతం చేసేందుకు ఇంటర్ విద్య కమిషనర్ కృష్ణ ఆదిత్య ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లోని తరగతి గదుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఇంటర్ బోర్డు నుంచి కమాండ్ కంట్రోల్ యూనిట్ ద్వారా బోధనను పర్యవేక్షిస్తున్నారు. ఇందులో భాగంగా జనగామ జిల్లాలోని 7 ప్రభుత్వ జూనియర్ కళాశాలలోనూ సీసీటీవీ పర్యవేక్షణలోనే బోధన జరుగుతోంది.