News March 18, 2025
బాధితులకు భరోసా కల్పించాలి: సూర్యాపేట ఎస్పీ

శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజా సమస్యల పరిష్కరిస్తూ బాధితులకు అండగా ఉంటూ ఫిర్యాదుల పై వెంటనే చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఎస్పీ నరసింహ అన్నారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజావాణి సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులతో మాట్లాడి వారి అర్జీలను పరిశీలించారు. ఎస్పీ మాట్లాడుతూ.. ఫిర్యాదుదారులకు భరోసా కల్పించాలని అన్నారు.
Similar News
News October 23, 2025
బంగ్లాదేశ్కు ఏపీ ప్రభుత్వం లేఖ

AP: విజయనగరం(D)కి చెందిన 8మంది మత్స్యకారులు పొరపాటున బంగ్లాదేశ్ సముద్ర జలాల్లోకి ప్రవేశించి అక్కడి నావికాదళానికి పట్టుబడడం తెలిసిందే. దీంతో వారి కుటుంబాలు తీవ్ర ఆందోళనతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో వారి విడుదలపై ఏపీ ప్రభుత్వం బంగ్లాదేశ్ GOVTకి లేఖ రాసింది. వారిని క్షేమంగా వెనక్కు రప్పిస్తామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఆందోళన వద్దని ఆ కుటుంబాలకు సూచించారు.
News October 23, 2025
JGTL: పెళ్లి పత్రికలు ఇచ్చొస్తుండగా ప్రమాదం.. ఒకరు మృతి

జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం నందగిరి సమీపంలోని రైతు వేదిక వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. పెగడపల్లి SI కిరణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల మండలం సోమన్పల్లికి చెందిన చెట్ల వంశీ, ఉప్పెర రంజిత్ ద్విచక్రవాహనంపై మండలంలోని ఐతుపల్లిలో పెండ్లి పత్రికలు ఇచ్చి తిరిగి వస్తుండగా, వారిని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో వంశీ అక్కడికక్కడే మృతి చెందాడు.
News October 23, 2025
GNT: దూరవిద్య పరీక్ష ఫలితాలు విడుదల

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం దూరవిద్య కేంద్రం పరిధిలో జులై, ఆగస్ట్ మాసాలలో జరిగిన పలు యూజీ, పీజీ కోర్సుల పరీక్ష ఫలితాలను వర్సిటీ రెక్టార్ ఆర్. శివరాం ప్రసాద్, రిజిస్ట్రార్ జి. సింహాచలంలు గురువారం విడుదల చేశారు. ఎంఏ ఎకనామిక్స్, బిఎల్ఐసి, బిఏ, బీకాం, బిబిఎం పరీక్ష ఫలితాలను విడుదల చేశారు. కార్యక్రమంలో కేంద్రం డైరెక్టర్ వంకాయలపాటి వెంకటేశ్వర్లు, కోఆర్డినేటర్ డి.రామచంద్రన్, తదితరులు పాల్గొన్నారు.