News November 14, 2024
బాధితులల్లో మన గుంటూరుకే మొదటి స్థానం

రాష్ట్రవ్యాప్తంగా 2022లో నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ (NCD) ప్రజల ఆరోగ్యంపై కోసం ఇళ్ల వద్దకే వెళ్లి బీపీ, షుగర్, బీఎంఐ.. సహా పలు రకాల స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లా వ్యాప్తంగా 74.48 శాతం మందికి పరీక్షలు నిర్వహించగా అత్యధికంగా జిల్లాలో 65,772 మంది షుగర్ బాధితులు ఉన్నారు. ఈ నేపథ్యంలో షుగర్ బాధితులలో గుంటూరు మొదటి స్థానంలో నిలిచింది. కాగా ఇప్పుడు ఈ సంఖ్య ఇంకా పెరిగింది.
Similar News
News October 17, 2025
తెనాలి: హత్య కేసులో నిందితుడి అరెస్ట్

తెనాలి చెంచుపేటలో మంగళవారం జరిగిన జుటూరి తిరుపతిరావు హత్య కేసు నిందితుడు గండికోట వెంకట సుబ్బారావును త్రీ టౌన్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. మృతుడు, నిందితుడి స్వగ్రామమైన కోడితాడిపర్రులో నెలకొన్న చిన్న వివాదాలే హత్యకు దారితీశాయని డీఎస్పీ జనార్ధనరావు, సీఐ సాంబశివరావు తెలిపారు. నిందితుడిని రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరుపరుస్తామన్నారు.
News October 17, 2025
మంగళగిరి: ‘మెడికల్ కాలేజీలపై వైసీపీ తప్పుడు ప్రచారం’

మంగళగిరిలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కమిటీ రాష్ట్ర అధికార ప్రతినిధులు, ప్యానలిస్టుల కార్యక్రమాన్ని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ ప్రారంభించారు. కుల వివక్షతకు వ్యతిరేకంగా తిరుపతి నుంచి సంజీవని స్వరం పేరుతో కార్యక్రమం చేపడతామని మంత్రి తెలిపారు. కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలు నిర్మాణానికి చేపట్టిన పీపీపీ విధానంపై వైసీపీ కావాలనే తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు.
News October 17, 2025
వసతి గృహ భవనాల ముఖచిత్రం మారాలి: కలెక్టర్

ప్రభుత్వ భవనాలలో నడుస్తున్న సంక్షేమ వసతి గృహాల ముఖ చిత్రాలు మారాలని కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా అన్నారు. ఇంజనీరింగ్, సంక్షేమ శాఖలతో శుక్రవారం కలెక్టరేట్లో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ భవనాల్లో ఉన్న 20 సాంఘిక సంక్షేమ, 8 బిసి సంక్షేమ, 3 గిరిజన సంక్షేమ వసతి గృహాలలో సహా అంగన్వాడీ కేంద్రాలలో అవసరమగు మౌలిక సదుపాయాలు గుర్తించాలని నివేదికలు అందజేయాలని ఇంజినీరింగ్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.