News April 3, 2025
బాధ్యతలు చేపట్టిన విశాఖ బార్ అసోసియేషన్ సభ్యులు

విశాఖపట్నం బార్ అసోసియేషన్ ఎన్నికల్లో విజయం సాధించిన వారు గురువారం బాధ్యతలు చేపట్టారు. అధ్యక్షుడిగా విజయం సాధించిన ఎమ్.కె శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు చింతపల్లి ఆనంద్ కుమార్, జనరల్ సెక్రటరీగా పార్వతి నాయుడు, కోశాధికారిగా శ్రీదివ్యష్ భాద్యతలు చేపట్టారు. బార్ కౌన్సిల్ సభ్యుల సమక్షంలో బాధ్యతలు స్వీకరించారు. విజయం సాధించిన అధ్యక్ష, ఉపాధ్యక్షులు మాట్లాడుతూ.. న్యాయవాదుల సంక్షేమానికి కృషి చేస్తామన్నారు.
Similar News
News October 18, 2025
ఆటోలు గుద్దుకున్నా ఛలో పోలీస్ స్టేషన్ అంటారేమో: విష్ణుకుమార్ రాజు

వైసీపీ స్థితిని చూస్తే బాధ కలుగుతోందని ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. రెండు ఆటోలు గుద్దుకున్నా ఛలో పోలీస్ స్టేషన్ అనే స్థాయికి దిగిపోయిందని ఎద్దేవా చేశారు. వైజాగ్ ఐటీ, ఐటీ అనుబంధ రంగాలకు బెస్ట్ డెస్టినేషన్ అవుతుందన్నారు. అదానీకి భూములు ధారాదత్తం చేసిన ఘనత వైసీపీకే దక్కుతుందన్నారు. గూగుల్ డేటా సెంటర్ వల్ల ప్రత్యక్షంగా 2వేల ఉద్యోగాలు, పరోక్షంగా వేలాది మంది ఉపాధి పొందుతారని వెల్లడించారు.
News October 18, 2025
గాజువాక: టిప్పర్ బీభత్సం.. మహిళ మృతి

గాజువాక సమతా నగర్లో దారుణం చోటుచేసుకుంది. శనివారం ఉదయం భారీ టిప్పర్ రోడ్డు పక్కన కొబ్బరిబోండాలు అమ్ముతున్న వియ్యపు అప్పయ్యమ్మపైకి దూసుకెళ్లింది. ప్రమాదంలో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. చిన్న బాలుడికి గాయాలు అయ్యాయి. న్యూపోర్ట్ పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. నిద్రమత్తులో వాహనం నడపడం వలనే ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు.
News October 17, 2025
విశాఖ డీఆర్వో Vs ఆర్డీవో

విశాఖ DRO భవానీ శంకర్, RDO శ్రీలేఖ మధ్య కోల్డ్ వార్ తారాస్థాయికి చేరింది. డీఆర్వోపై కలెక్టర్కు ఆర్డీవో ఇటీవల లేఖ రాయగా.. రెవెన్యూ సిబ్బంది కలెక్టర్ను శుక్రవారం కలిసి వినతిపత్రం అందించినట్లు సమాచారం. పచారీ సరుకుల కోసం తహశీల్దార్లకు ఇండెంట్లు పెడుతున్నారన్న RDOఆరోపణలపై ‘అవగాహన లేని అధికారి చేసిన ఆరోపణలపై స్పందించాల్సిన అవసరం లేదని’ DRO అన్నారు. కలెక్టర్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.